కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ.. 'సూరత్ నమూనా'పై కీలక చర్చ!

0
62

సీఆర్ పాటిల్ తో పవన్ కల్యాణ్ భేటీ

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీరలేదని చెప్పిన పవన్

నదీ జలాల స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, కలుషితమవుతున్న నదుల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్ అమలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటి కొరత తీరలేదని పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

 

 

 

ప్రజలకు స్థిరమైన తాగునీటి సరఫరా అందించడానికి గుజరాత్‌లోని 'సూరత్ నమూనా'ను అధ్యయనం చేయాలని అధికారులకు పవన్ సూచించారు. సూరత్‌లో పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్లీ ఎలా విజయవంతంగా వినియోగిస్తున్నారో, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు.

 

 

గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో నదీ జలాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ స్పష్టం చేశారు. పారిశ్రామిక కాలుష్యం వల్ల ఏపీలోని నదులు, జలవనరులు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు వదిలే వ్యర్థాల వల్ల నదులు కలుషితం కాకుండా ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పులిచర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి
బుధవారం పులిచర్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి....
By Kothuru Murali 2026-04-29 11:24:33 0 99
Andhra Pradesh
ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ ఇచ్చిన విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు
ఆదివారం మధ్యాహ్నం రాజంపేట పట్టణంలోని ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ గారు ఆహ్వానం మేరకు...
By Benguluri Madhubabu 2026-03-15 08:36:01 0 234
Telangana
నోట్లోనే పేలిన ఛార్జింగ్ లైట్ బ్యాటరీ. ఆసిఫాబాద్ జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర...
By Chunarkar Jagadeesh 2026-07-22 13:30:00 0 52
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 175
Telangana
పేదలకు అండగా ఎమ్మెల్యే… సీఎం రిలీఫ్ ఫండ్‌తో రూ.2 లక్షల సహాయం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ప్రజల...
By Sidhu Maroju 2026-04-13 09:35:49 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com