కూకట్‌పల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై శిక్షణ

0
176

 

కూకట్‌పల్లి, జూన్ 16: కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారి ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR)  కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, BLAలు పాల్గొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ సతీష్ సావంత్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వజ్రేష్ యాదవ్, టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ మన్నే సతీష్, తెలంగాణ బ్రాహ్మణ సంఘం వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తూము వేణు, పటోళ్ల నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి తదితరులు హాజరై     బూత్ లెవెల్ ఏజెంట్ లకు పలు కీలక సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం, అక్రమాలను అడ్డుకోవడం, ప్రతి ఇంటికి చేరుకుని ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రజలకు అవగాహన కల్పించడం బూత్ లెవెల్ ఏజెంట్ ది ప్రధాన బాధ్యత అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ముందుంటుందని పేర్కొన్న ఆయన, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా  బూత్ లెవెల్ ఏజెంట్ లు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ లు అంకితభావంతో పనిచేయాలని, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రానున్న కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మైనారిటీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు,...
By Ponnala Srinivasrao 2026-07-09 01:46:55 0 120
Telangana
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు  ...
By Pinnehasan Odela 2026-03-06 14:06:20 0 231
Andhra Pradesh
ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు...
By Pagadala Venkateswar 2026-03-05 03:50:15 0 136
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
By John Baji 2026-01-01 02:48:16 0 188
Andhra Pradesh
ఆంధ్ర రాజాసింగ్ రఘురామ పురం రాజును అరెస్టు చేయాలి, విలేఖరుల సమావేశంలో దళిత నేత నీలం డిమాండ్.
చీరాల  అకివీడు మాల పేట పై రాముడు పేరుతో అధికార పోలీస్ బలగలాతో దాడి చేసిన డిప్యూటీ స్పీకర్...
By Vadlamudi NagaVenkat 2026-04-07 13:01:13 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com