సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు

0
664

మార్కాపురం:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు ప్రదానం చేశారు.

గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సామాజిక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, థలసేమియా పిల్లలకు రక్తం అందించడం, వృద్ధాశ్రమాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, పేదలకు ఆహారం అందించడం వంటి సేవలను గుర్తించి సూర్యోదయ సంస్థకు ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డును గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు, ప్రముఖులు పి.వి.సి. అంజనీ కుమారి (హైకోర్టు సూపరింటెండెంట్, హైదరాబాద్), జి. గోవింద్ (టీచర్, రైటర్, యాక్టర్), జి. చెన్నకేశవులు (ఇన్ఫోటెక్ సీఈవో, బెంగళూరు), రాధా (స్టేట్ మెంబర్, వాసవి క్లబ్), మాజీ గవర్నర్ కిరణ్ కుమార్ గంగిశెట్టి, ఎం. నాగిరెడ్డి చేతుల మీదుగా డి. గోవిందరెడ్డి స్వీకరించారు.

ఈ సందర్భంగా సూర్యోదయ సంస్థ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో అవసరమైన వారికి సహాయం అందించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో కాంగ్రెస్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్.
మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో ఆదివారం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం...
By Pagadala Venkateswar 2026-03-09 05:42:58 0 108
Telangana
సమిష్టి కృషితో బిఆర్ఎస్ (మన) అభ్యర్థిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల లో భాగంగా, భారత...
By Sidhu Maroju 2025-10-12 12:40:10 0 226
Telangana
తెలంగాణ: అప్పుల ఊబిలో రాష్ట్రం- కుదేలైన ఖజానా .|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి...
By Sidhu Maroju 2026-02-23 15:23:51 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com