సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు

0
667

మార్కాపురం:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు ప్రదానం చేశారు.

గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సామాజిక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, థలసేమియా పిల్లలకు రక్తం అందించడం, వృద్ధాశ్రమాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, పేదలకు ఆహారం అందించడం వంటి సేవలను గుర్తించి సూర్యోదయ సంస్థకు ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డును గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు, ప్రముఖులు పి.వి.సి. అంజనీ కుమారి (హైకోర్టు సూపరింటెండెంట్, హైదరాబాద్), జి. గోవింద్ (టీచర్, రైటర్, యాక్టర్), జి. చెన్నకేశవులు (ఇన్ఫోటెక్ సీఈవో, బెంగళూరు), రాధా (స్టేట్ మెంబర్, వాసవి క్లబ్), మాజీ గవర్నర్ కిరణ్ కుమార్ గంగిశెట్టి, ఎం. నాగిరెడ్డి చేతుల మీదుగా డి. గోవిందరెడ్డి స్వీకరించారు.

ఈ సందర్భంగా సూర్యోదయ సంస్థ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో అవసరమైన వారికి సహాయం అందించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 205
Telangana
సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన...
By Sidhu Maroju 2025-11-26 15:38:01 0 153
Andhra Pradesh
Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం 13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-01-26 05:50:21 0 136
Andhra Pradesh
వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి.. ఫుడ్ కమిషన్ ఛైర్మన్.
ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీలు, చౌక ధరల...
By Pagadala Venkateswar 2026-03-09 05:47:01 0 105
Andhra Pradesh
ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.
ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు...
By Pagadala Venkateswar 2026-05-19 05:30:38 0 37
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com