రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని RPSF రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిద్ డిమాండ్ చేశారు

0
151

రాయలసీమ యూనివర్సిటీ లో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న వీసీ మరియు రిజిస్టర్ పై సమగ్రమైన విచారణ జరిపించి ఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరాజు మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ పై పెట్టిన కేసులా ను ఎత్తివేయాలని RPSFరాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ లో గత కొన్ని నెలలు గా వీసీ మరియు రిజిస్టర్ చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకు ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరాజు పై వీసీ కేసులు పెట్టడం జరిగింది అలాగే ఇతర విద్యార్ధి సంఘాలను యూనివర్సిటీ నుంచి తొలగించడం సిగ్గుచేటు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . గత నెలలో వీసీ, రిజిస్టర్ అక్రమాలు పై జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంపై స్పందించిన మంత్రిగారు వెంటనే రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిజిపి గారికి మంత్రిగారి లెటర్ నుండి సిఫారసు లేఖ రాయడం జరిగింది . అయ్యా రాయలసీమ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ గారికి మీకు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ సప్లి నిర్వహించండి అనేది నేరమా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థికి అగ్ని వీర్ లో ఉద్యోగం వచ్చిందని అందుకు బోనఫైడ్ కావాలని అడుగగా ఇవ్వం అన్నందుకు ఎందుకు ఇవ్వరు అన్నందుకు నేరమా యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విద్యాశాఖ మంత్రి గారికి వివరిస్తాం అని తెలపడం నేరమా తరచూ యూనివర్సిటీ వ్యవహారం పేపర్లలో వస్తుంది అవినీతి అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్టర్ను తన మాతృ సంస్థకు పంపండి అని అడగడం నేరమా యూనివర్సిటీలో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి దీనిపై విచారణ చేయండి అని చెప్పడం తప్ప ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్ ఆలోచించండి అని అడగడం నేరమైందా అంటూ అదే విధంగా కొంతమంది అవినీతి అధికారులు మళ్ళి తప్పుదోవ పట్టిస్తున్నారు సార్ వీటన్నింటిపై ప్రభుత్వం నికి తెలపడంతో పాటు మంత్రిగారికి వివరిస్తాం అంటుంటే సెక్యూరిటీతో గెంటేంచడం ఎంతవరకు న్యాయమని ఆలోచించాలని అంటే ఇది నేరమా ఇప్పటికి అయినా ఈ విషయం పై ప్రభుత్వం స్పందించకపోతే ఇతర విద్యార్థి సంఘాలను యువజన సంఘాలను కలుపుకొని రాయలసీమ యూనివర్సిటీ ముట్టడించి వాస్తవాలు బయటపెడతామని తెలియజేస్తున్నాం. యూనివర్సిటీలో వీసీ మరియు రిజిస్టర్ అవినీతి అక్రమాలపై విద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు నర్సింహా నాయుడు, మహబూబ్, లక్ష్మన్న, షైక్ష వలి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Vizhinjam Port Stake Transfer Subject to State Approval
The Kerala government has clarified that any transfer of equity in the Vizhinjam International...
By Navya Sree 2026-07-04 05:33:38 0 34
Chandigarh
Chandigarh Police Ramp Up Special Security Crackdowns
The Chandigarh Police administration has significantly intensified its urban enforcement...
By Lokeshwari Panthadi 2026-06-25 11:42:04 0 46
Andhra Pradesh
తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు.
జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం గతంలోనూ ఓ హత్య కేసులో...
By Pagadala Venkateswar 2026-06-10 05:47:59 0 94
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 161
Telangana
మొహరం పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే
మొహరం పండుగ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు సమావేశ హాల్లో రవాణా...
By Sidhu Maroju 2025-06-10 15:30:37 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com