రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని RPSF రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిద్ డిమాండ్ చేశారు

0
153

రాయలసీమ యూనివర్సిటీ లో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న వీసీ మరియు రిజిస్టర్ పై సమగ్రమైన విచారణ జరిపించి ఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరాజు మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ పై పెట్టిన కేసులా ను ఎత్తివేయాలని RPSFరాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ లో గత కొన్ని నెలలు గా వీసీ మరియు రిజిస్టర్ చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకు ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరాజు పై వీసీ కేసులు పెట్టడం జరిగింది అలాగే ఇతర విద్యార్ధి సంఘాలను యూనివర్సిటీ నుంచి తొలగించడం సిగ్గుచేటు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . గత నెలలో వీసీ, రిజిస్టర్ అక్రమాలు పై జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంపై స్పందించిన మంత్రిగారు వెంటనే రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిజిపి గారికి మంత్రిగారి లెటర్ నుండి సిఫారసు లేఖ రాయడం జరిగింది . అయ్యా రాయలసీమ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ గారికి మీకు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ సప్లి నిర్వహించండి అనేది నేరమా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థికి అగ్ని వీర్ లో ఉద్యోగం వచ్చిందని అందుకు బోనఫైడ్ కావాలని అడుగగా ఇవ్వం అన్నందుకు ఎందుకు ఇవ్వరు అన్నందుకు నేరమా యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విద్యాశాఖ మంత్రి గారికి వివరిస్తాం అని తెలపడం నేరమా తరచూ యూనివర్సిటీ వ్యవహారం పేపర్లలో వస్తుంది అవినీతి అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్టర్ను తన మాతృ సంస్థకు పంపండి అని అడగడం నేరమా యూనివర్సిటీలో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి దీనిపై విచారణ చేయండి అని చెప్పడం తప్ప ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్ ఆలోచించండి అని అడగడం నేరమైందా అంటూ అదే విధంగా కొంతమంది అవినీతి అధికారులు మళ్ళి తప్పుదోవ పట్టిస్తున్నారు సార్ వీటన్నింటిపై ప్రభుత్వం నికి తెలపడంతో పాటు మంత్రిగారికి వివరిస్తాం అంటుంటే సెక్యూరిటీతో గెంటేంచడం ఎంతవరకు న్యాయమని ఆలోచించాలని అంటే ఇది నేరమా ఇప్పటికి అయినా ఈ విషయం పై ప్రభుత్వం స్పందించకపోతే ఇతర విద్యార్థి సంఘాలను యువజన సంఘాలను కలుపుకొని రాయలసీమ యూనివర్సిటీ ముట్టడించి వాస్తవాలు బయటపెడతామని తెలియజేస్తున్నాం. యూనివర్సిటీలో వీసీ మరియు రిజిస్టర్ అవినీతి అక్రమాలపై విద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు నర్సింహా నాయుడు, మహబూబ్, లక్ష్మన్న, షైక్ష వలి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 285
Tamilnadu
EVM Verification Completed Ahead of Tamil Nadu Bypolls
Election authorities in Tamil Nadu have successfully completed the first round of Electronic...
By Navya Sree 2026-06-25 13:18:13 0 92
Telangana
*బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ పరామర్శ*
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన *ఉప్పులేటి కొమురవ్వ* ఇటీవలే అనారోగ్య కారణాలతో...
By Bouth Arun 2025-12-26 06:58:00 0 592
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
By Chennaiah Kati 2026-01-30 13:30:05 0 222
Andhra Pradesh
టీడీపీ ఆవిర్భావ వేడుకల జయప్రదానికి పిలుపు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతి నుంచి వీడియో...
By Boiena Rajesh 2026-03-28 13:46:59 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com