శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు

7
1K

హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్ మొదటి దశలో వేసిన పత్తి పంటపై వర్షాల ప్రభావం అధికంగా ఉండటం వలన రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూసారు. ముఖ్యంగా కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బపడి తీవ్రంగా నష్టపోయారు. తద్వారా రెండవ పంట వేసే క్రమంలో రైతులు మండల వ్యాప్తంగా చాలా ఎకరాలలో మొక్క జొన్న సాగుకు మొగ్గుచూపారు. రేయి పగలు కష్టపడి పండించిన పంట పై అధిక దిగుబడులు సాధించారు. అనుకున్నదే తడువుగా ప్రభుత్వం కూడా రైతన్నలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్ ఫెడ్ మద్దతు ధర 2400 చొప్పున క్వింటాలుకు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుని శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రాథమిక సహకార సంఘ ప్రతినిధులు వ్యవహరించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి సరైన సంఖ్యలో గన్ని బ్యాగులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాభావ పరిస్థితుల్లో భయపడిన రైతన్న అధిక డబ్బులు వెచ్చించి ప్రైవేటుగా గన్ని బ్యాగులు కొనుగోలు చేసి మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాల నుంచి కేంద్రానికి ట్రాక్టర్ లలో కిరాయి పెట్టుకుని వచ్చిన రైతన్నకు అడుగడుగున నిరాశే ఎదురైంది.

దాదాపు 60 లక్షల నుండి 70 లక్షల వరకు దండుకున్నారు

కొనుగోలు కేంద్రంలో ఎప్పటికపుడు సత్వరమే కాంటాలు నిర్వహించాలి , కాంటా అయిన తర్వాత బస్తాల పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాలదే అన్న ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తూ రైతుల ధాన్యాన్ని తూకం వేయడానికి వారం రోజులు ఆలస్యం చేసిన తర్వాత బస్తాలు లారీలో ఎగుమతి కావాలంటే హమాలీ ఛార్జీలు 60 నుండి 65 రూపాయలే కాకుండా ఒక్కో 51 కేజీ బస్తాకు 30 రూపాయలు అదనంగా డబ్బులు చెల్లించిన రైతు ధాన్యం మాత్రమే ఎగుమతి చేయాలని,లేనిచో కాంటా అయిన కూడా ఆ బస్తాలకు కొనుగోలు కేంద్రానికి సంబంధం లేదని పూర్తి బాధ్యత రైతే తీసుకోవాలని దురుసుగా ప్రవర్తించారు. హన్మకొండ జిల్లాలో అత్యధికంగా 2 లక్షలకు పైగా బస్తాలు రైతుల నుండి కొనుగోలు చేసి ఒక్కో బస్తాకు 30 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే మద్దతు ధర లభిస్తుందని ఆశపడ్డ రైతన్న ను మోసం చేశారు కేంద్ర నిర్వాహకులు,కావున ప్రభుత్వం మరియు జిల్లా , రాష్ట్ర మార్క్ ఫెడ్ అధికారులు స్పందించి శాయంపేట ప్రాథమిక సహకార సంఘం పర్యవేక్షణలో నిర్వహించిన కొనుగోలు కేంద్రం పై విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
By Sidhu Maroju 2026-03-29 13:53:25 0 315
Telangana
"బాల్క సుమన్ లొంగిపోయినట్లు ప్రచారం.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపు.|
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్...
By Sidhu Maroju 2026-05-30 08:38:18 0 160
Telangana
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ...
By Prashanth Goindla 2026-02-10 14:57:38 0 458
Andhra Pradesh
సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే.
ఆదివారం రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-23 06:46:23 0 142
Andhra Pradesh
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
By Pagadala Venkateswar 2026-01-15 07:04:20 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com