ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు.

0
63

 

 

ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు

11-06-2026 Thu 

Andhra

Andhra Pradesh Rains Expected Today Due to Trough Effect

రాయలసీమ, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాల అంచనా

విశాఖలో ఈదురుగాలులకు నష్టం.. విరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు

అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.

 

ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు.

 

కాగా, బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేరులో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, అనకాపల్లి జిల్లా మకవరపాలెం, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గరిష్ఠంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

 

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలుల వల్ల పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, వర్ష సూచన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, బలమైన గాలుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం...
By Pagadala Venkateswar 2026-01-28 10:32:39 0 143
Andhra Pradesh
జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం
జనసేన నాయకుల మానవతా    ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల...
By Chennaiah Kati 2026-01-27 16:05:16 0 194
Punjab
AAP Defends CM Bhagwant Mann Amid Sacrilege Video Row
The Aam Aadmi Party (AAP) is vigorously defending Punjab Chief Minister Bhagwant Mann amid an...
By Hazu MD. 2026-06-25 05:11:38 0 175
Andaman & Nikobar Islands
Andaman Boosts Organic Farming and Coconut Sector
The Andaman & Nicobar Islands continue to strengthen agriculture in 2026 by promoting organic...
By Fathima Safa 2026-07-04 12:11:13 0 106
Telangana
పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి...
By Pindikura Mahesh 2026-05-30 03:11:39 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com