ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు.

0
64

 

 

ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు

11-06-2026 Thu 

Andhra

Andhra Pradesh Rains Expected Today Due to Trough Effect

రాయలసీమ, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాల అంచనా

విశాఖలో ఈదురుగాలులకు నష్టం.. విరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు

అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.

 

ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు.

 

కాగా, బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేరులో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, అనకాపల్లి జిల్లా మకవరపాలెం, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గరిష్ఠంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

 

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలుల వల్ల పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, వర్ష సూచన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, బలమైన గాలుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....
ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు...
By Gujile Ramu 2026-04-25 11:17:50 0 178
Andhra Pradesh
నిమ్మనపల్లి: అడవిలో మంటలు ఆర్పేందుకు వెళ్లి ఎఫ్. బి. ఓ అస్వస్థత.
గురువారం నిమ్మనపల్లి మండలం గొల్లపల్లె సమీపంలోని పెద్దకొండపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన...
By Pagadala Venkateswar 2026-03-06 02:55:13 0 142
Andhra Pradesh
Chandrababu Naidu: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం... పడగొట్టినవి నిలబెడదాం: సీఎం చంద్రబాబు.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు సమీక్ష రాయలసీమ, ప్రకాశం జిల్లాల...
By Pagadala Venkateswar 2026-01-28 08:03:56 0 144
Andhra Pradesh
అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం..
రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతిలో రూ.80...
By John Baji 2025-12-27 11:28:46 0 186
Telangana
నిజామాబాద్: ఆటోనగర్ లోని శ్రీ సాయి అద్వర్యంలో స్పె రే పెయింట్స్
నిజామాబాద్: శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ లో సంతోష్ గౌడ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం...
By Sadaq Sadaq 2026-03-18 14:36:48 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com