స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

0
68

 

స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

Andhra

Chandrababu Naidu Reviews Swachh Andhra Progress

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం

100 శాతం ఇంటింటి చెత్త సేకరణ, శుద్ధి జరగాలని ఆదేశం

అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం

హాస్టళ్లలో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు

పచ్చదనం పెంపు, సోలార్ రూఫ్‌టాప్‌లపై దృష్టి సారించాలని సూచన

'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు.

 

మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని సీఎం సూచించారు. ఇంటింటికీ వెళ్లి 100 శాతం చెత్త సేకరణ జరగాలని, సేకరించిన చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తడి, పొడి చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన వంటగదుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, నెట్ జీరో సాధన, పచ్చదనం పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు.

 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణ, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ కమిషనర్ సంపత్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.
అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ...
By Pagadala Venkateswar 2026-03-20 03:42:48 0 126
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి.
Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి...
By Pagadala Venkateswar 2026-02-06 13:18:38 0 126
Andhra Pradesh
తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా
న్యాయం జరగకపోతే ఆత్మహత్యల్లే శరణ్యం తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య...
By mahaboob basha 2025-10-27 23:10:57 0 237
Andhra Pradesh
"పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో చావులు పట్టించుకోని పాలకులు!"
పోలవరం జిల్లా చింతూరు మండలం మామిళ్ళగూడెం గ్రామం ఇప్పుడు కిడ్నీ వ్యాధుల కోరల్లో చిక్కుకుని...
By Shyamala Yadagiri 2026-05-02 05:11:10 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com