గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ

0
95

శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కి నూతన పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ వినియోగించారు అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తీర్మానాలు అయినా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పై ఉన్న సుమారు 24 లక్షల విద్యుత్ బిల్లుకు గల కారణాలను తెలుసుకుని , అనవసర వినియోగాన్ని తగ్గించి గ్రామ పంచాయతీ పై భారం తగ్గించే విధంగా పని చేయాలని చెప్పారు.

  బెల్టు షాపులను బహిష్కరించాలి 

గ్రామంలోని యువజన సంఘాల సభ్యులు అందరూ ఏకమై గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపుల వలన చాలా కుటుంబాలు నష్ట పడుతున్నాయని యువత కూడా మద్యానికి బానిసలు గా మారుతున్నారని కాబట్టి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తొలగించేలా చేయాలని వినతి పత్రం అందచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: యర్రాతివారిపల్లెలో ఇరుముడి చెల్లించిన పెద్దిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం యర్రాతివారి పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ మంత్రి, పుంగనూరు...
By Kothuru Murali 2026-01-15 06:01:35 0 147
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:30:37 0 2K
Andhra Pradesh
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-15 08:13:03 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com