గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ

0
97

శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కి నూతన పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ వినియోగించారు అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తీర్మానాలు అయినా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పై ఉన్న సుమారు 24 లక్షల విద్యుత్ బిల్లుకు గల కారణాలను తెలుసుకుని , అనవసర వినియోగాన్ని తగ్గించి గ్రామ పంచాయతీ పై భారం తగ్గించే విధంగా పని చేయాలని చెప్పారు.

  బెల్టు షాపులను బహిష్కరించాలి 

గ్రామంలోని యువజన సంఘాల సభ్యులు అందరూ ఏకమై గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపుల వలన చాలా కుటుంబాలు నష్ట పడుతున్నాయని యువత కూడా మద్యానికి బానిసలు గా మారుతున్నారని కాబట్టి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తొలగించేలా చేయాలని వినతి పత్రం అందచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాద బీమాతో ఆదుకున్న తెలుగుదేశం పార్టీ - బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత
బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-03-17 09:42:38 0 637
Andhra Pradesh
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ
2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు....
By John Baji 2025-12-30 12:06:24 0 142
Andhra Pradesh
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
By Patan Khuddus 2026-05-08 15:26:30 0 643
Andhra Pradesh
కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన
*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*   *సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని...
By Rajini Kumari 2026-04-04 15:01:06 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com