కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన

0
235

*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*

 

*సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి*

 

*సింధనూరు:* 

కర్ణాటకలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా కళ్యాణ మండపం ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక తెలుగుసంఘం నాయకులు, తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పట్ల నిర్వాహకులను అభినందించారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడకు వచ్చాను. తెలుగువారు ఎక్కడున్నా టీడీపీ అండగా ఉంటుంది. కుమారస్వామి గారి పక్కన నిల్చునే అదృష్టం నాకు కలిగింది. తెలుగువారి మద్దతకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ను శాలువా, ప్రత్యేక జ్ఞాపితకో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

*****

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం మహిళలపై నేరాల...
By Pagadala Venkateswar 2026-03-13 07:34:20 0 194
Andhra Pradesh
విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి అహుతి అయిన ఇల్లు - సర్వం కోల్పోయిన కుటుంబం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం...
By BABJI DADALA 2025-12-25 08:21:11 0 365
Andhra Pradesh
15 న ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు !! ఈనెల డిసెంబర్ 15వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలు పిర్యాదుల...
By Hari Krishna 2025-12-12 10:13:27 2 2K
Uttarkhand
Uttarakhand Expands Education and Skill Development
Uttarakhand continues to strengthen its education system by upgrading school infrastructure,...
By Fathima Safa 2026-06-27 07:44:15 0 49
Andhra Pradesh
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
By Benguluri Madhubabu 2026-03-24 11:56:22 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com