"పెండింగ్ సమస్యల పరిష్కారానికి డీసీని కలిసిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
212

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ప్రేమ్, సాజిద్, లింగారెడ్డి, మహేందర్, రాజేందర్‌లతో కలిసి డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్‌ కు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

కొత్త చెరువు కట్ట నుంచి సెలెక్ట్ థియేటర్ వైపు వెళ్లే రహదారి, అలాగే నాగిరెడ్డి కాలనీ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున వాటిని అత్యవసరంగా మరమ్మతులు చేయాలని కోరారు. అదేవిధంగా లోయోలా కళాశాల సమీపంలో, రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతంలో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎంఈఎస్ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, మురుగునీటి పారుదల మరియు చెత్త తొలగింపు పనులను వేగవంతం చేయాలని డీసీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరగా, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
రాజాంలో స్నేక్ క్యాచర్ ని కాటేసిన పాము
రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము...
By Boiena Rajesh 2026-07-17 05:57:44 0 44
Goa
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers Due to ongoing heavy rainfall...
By BMA ADMIN 2025-05-21 08:48:30 0 2K
Andhra Pradesh
Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి...
By Pagadala Venkateswar 2026-07-15 05:20:06 0 43
Andhra Pradesh
మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.
శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్...
By Pagadala Venkateswar 2026-02-13 11:00:26 0 153
Andhra Pradesh
25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి
25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం- ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 12:22:42 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com