తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం.

0
94

 

తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం

06-06-2026 Sat 08:40

Andhra

TTD Tirumala Srivari Darshan NRI opportunity extended to 3 months

ఎన్ఆర్ఐ భక్తులకు శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు

భారత్‌కు వచ్చిన 3 నెలల లోపు దర్శించుకునేందుకు అవకాశం

శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన

రూ. లక్ష విరాళం ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం

దాతల కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించే విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. ఎన్ఆర్ఐ భక్తులు సుపథం మార్గంలో పొందే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉన్న గడువును 30 రోజుల నుంచి ఏకంగా 90 రోజులకు (3 నెలలు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో విదేశాల నుంచి వచ్చే భక్తులు మరింత సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగుతుంది.

 

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు భారత్‌కు వచ్చిన 30 రోజుల్లోపే తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, జిరాక్స్ కాపీలతో తిరుమలలోని సుపథం వద్దకు వెళ్లి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ పొందాల్సి ఉండేది. ఈ తక్కువ గడువు కారణంగా చాలామంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గడువును పెంచాలని కొంతకాలంగా వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ, ఈ పరిమితిని మూడు నెలలకు పెంచింది. దీంతో ఎన్ఆర్ఐలు తమ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా మరింత వెసులుబాటుతో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

 

ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన

మరోవైపు టీటీడీ అమలు చేస్తున్న శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద టీటీడీ ఆపన్న హృదయ ట్రస్టుకు రూ. లక్ష విరాళంగా అందించిన దాతలకు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే భక్తులు, దర్శనానికి ఒకరోజు ముందుగా తిరుమలలోని దాతల విభాగంలో విరాళం చెల్లించాల్సి ఉంటుంది.

 

విరాళం చెల్లించిన తర్వాత వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.2,500 చెల్లించాలి. ఆ ఐదుగురు భక్తులకు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. దాతల సౌకర్యార్థం, తిరుమలలోని దాతల విభాగంలో ఈ ట్రస్టు కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు, దాతలకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో శ్రీ లక్ష్మి కల్యాణ మండపం లో...
By Sadaq Sadaq 2026-05-25 05:42:39 0 86
Telangana
ఏజెన్సీ మారుమూల ప్రాంతం నుండి మెరిసిన విద్యా కుసుమాలు
మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల...
By Bheeshman King 2026-04-29 12:16:03 0 1K
Andhra Pradesh
గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి...
By Rajini Kumari 2025-12-16 07:25:32 0 209
Andhra Pradesh
స్వాతంత్ర్య సమరయోధుల కుమారులకు గణతంత్ర దినోత్సవం నాడు ఘన సన్మానం.
రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు...
By Pagadala Venkateswar 2026-01-27 07:15:14 0 165
Telangana
సార్
కొడంగల్ లో ని తన స్వగృహంలో సార్ ప్రక్రియలో పాల్గొని ఏంయుమరేషన్ ఫామ్ ను బిఎల్ ఓ కు అందజేసిన...
By Vanmoj Suryamohan 2026-07-22 05:32:24 0 21
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com