ఆసిఫాబాద్‌ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ: తక్షణ ఆర్థిక సహాయం అందజేత

0
112

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దస్నాపూర్‌లో అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర అగ్నిప్రమాదం బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ గురువారం పరామర్శించారు. ప్రమాదంలో ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను వారు కలిసి ఓదార్చారు. అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెబుతూ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటన తీవ్రతను మరియు బాధితుల దుస్థితిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే సానుకూలంగా స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందవలసిన అత్యవసర సహాయాన్ని వెంటనే అందిస్తామని, అలాగే నిరాశ్రయులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, గులాం జావిద్, NSUI జిల్లా నాయకులు ఆసిఫ్, సర్పంచ్ బసవయ్య, మేకర్తి శ్రీను, నిఖిల్, రాజేందర్, జమీర్, అబ్బు, బండి సాయి, చాపడి సురేష్‌లతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Ladakh
Digital Health Cards Rolled Out for Changpa Nomads in Ladakh
The Ladakh Health Department has launched a Digital Health Card scheme exclusively for the...
By Bharat Aawaz 2025-07-17 06:34:24 0 964
Telangana
మైనంపల్లి మార్క్ డెవలప్‌మెంట్: ముక్తిధామం క్లీన్ అండ్ గ్రీన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఈరోజు మల్కాజిగిరి ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు...
By Sidhu Maroju 2026-04-07 12:17:04 0 194
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 119
Andhra Pradesh
మాధురి స్కూల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకలు..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామంలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు...
By BABJI DADALA 2026-02-28 16:02:36 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com