ఆసిఫాబాద్‌ పట్టణం దశ్నపూర్ లో అగ్నిప్రమాదం బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

0
318

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

జూన్ 04: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ కాలనీలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, రెండు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు తక్షణ సహాయం కింద అత్యవసర నిత్యావసర సరుకులు, దుస్తులు మరియు రూ. 20,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం తరపున కూడా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్, మున్సిపల్ కౌన్సిలర్లు సలాం, బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ  నాయకురాలు మారుస్కోల సరస్వతి, మండల అధ్యక్షుడు జబోరే రవీందర్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా, దూడల అశోక్, సాయి, శ్రవణ్ తదితర స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గౌరవ ఏపీ ఈగల్ చీఫ్ ఐజిపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గారు మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమం చేపట్టారు.
 తేది*: 30-12-2025 📍*స్థలం*: అరండలపేట పిఎస్ లిమిట్స్, గుంటూరు *గౌరవ ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి...
By KOTESWARARAO KVSR 2025-12-30 13:04:17 0 548
Andhra Pradesh
బాపట్ల. టౌన్ హాల్ .లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ మరియు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ..
బాపట్ల: బాపట్లలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రధమాంద్ర మహాసభ స్మారక విజ్ఞాన...
By Gadiyapudi Narendra 2026-03-15 13:46:38 0 438
Andhra Pradesh
పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్...
By Kothuru Murali 2026-05-21 18:14:34 0 87
Telangana
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-11-23 15:11:11 0 173
Andhra Pradesh
పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ తల్లి
పుంగనూరు పట్టణంలో బుధవారం సుగుటూరు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారు...
By Kothuru Murali 2026-03-13 03:27:21 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com