ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించే పండుగ అని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి కౌన్సిలర్ రాజిరెడ్డి, కొంపల్లి బీజేపీ అధ్యక్షులు సతీష్ సాగర్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, రాజకుమార్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ గణపతి ప్రతిష్ట కార్యక్రమం భక్తి, ఉత్సాహం నడుమ నిర్వహించబడింది.
#sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz