"బస్తీల బాట పట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్.. నవ కంటోన్మెంట్ లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన".|

0
106

మేడ్చల్–మల్కాజిగిరి : జిల్లాలో నవ కంటోన్మెంట్ నిర్మాణ లక్ష్యంతో అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావాలని సంకల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం బొల్లారం పరిధిలోని జనప్రియ బంగ్లా, శాంతి నగర్ కాలనీ, గడ్డి బస్తీలలో విస్తృతంగా పర్యటించారు.

సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బస్తీల్లో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. 

డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, కమ్యూనిటీ హాళ్ల అవసరం వంటి పలు మౌలిక వసతుల అంశాలపై స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, నవ కంటోన్మెంట్ నిర్మాణం కేవలం నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే అభివృద్ధి కార్యక్రమంగా నిలవాలని తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రాంతంలోని మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వానికి, తమ ప్రజాప్రతినిధిత్వానికి ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కాలనీల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, నాని, రామచంద్రారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: అమరావతిలో ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’... వైద్యరంగంలో సరికొత్త విప్లవం!
      Chandrababu Naidu: అమరావతిలో ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’......
By Pagadala Venkateswar 2026-01-19 17:06:43 0 149
Telangana
నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు...
By Avunoori Mahesh 2026-05-14 10:02:00 0 147
Education
Opportunity for Researchers! The IKS Division, Ministry of Education, is inviting applications for the Competitive Research Proposals Program 2026–27
The Indian Knowledge Systems (IKS) Division, under the Ministry of Education, Government of...
By Venugopal Gopal 2026-01-17 16:46:35 0 4K
Rajasthan
राजस्थान सरकार ने IAS, IPS और IFS अधिकारियों की केंद्र प्रतिनियुक्ति पर रोक लगाई
राजस्थान सरकार ने #IAS, #IPS और #IFS अधिकारियों की #केंद्र_प्रतिनियुक्ति पर रोक लगा दी है। इस...
By Pooja Patil 2025-09-13 08:19:13 0 514
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com