"ఆదివారం నుంచి కనిపించని బాలుడు.. సమాచారం ఇవ్వాలంటూ పోలీసుల విజ్ఞప్తి.|

0
194

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

మణికంఠ అనే బాలుడు ఈ నెల 31వ తేదీ ఆదివారం సాయంత్రం సుమారు 4:35 గంటల సమయంలో చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

అప్పటి నుంచి బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బాబు, రమ్య దంపతుల కుమారుడైన మణికంఠ వయస్సు 7 సంవత్సరాలు. తెల్లటి వర్ణంతో సుమారు 4.5 అడుగుల ఎత్తు కలిగిన ఈ బాలుడు అదృశ్యమైన సమయంలో ఎరుపు రంగు చొక్కా, ప్యాంటు ధరించి ఉన్నట్లు సమాచారం. 

బాలుడి కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకి లభించలేదు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు బాలుడి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. 

మణికంఠను ఎక్కడైనా గుర్తించినా లేదా అతని గురించి ఏదైనా సమాచారం తెలిసినా వెంటనే కుటుంబ సభ్యులను 8185035791 నంబర్‌లో లేదా బొల్లారం పోలీస్ స్టేషన్ 8712661260 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బాలుడి ఆచూకీ త్వరగా లభించేందుకు ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేసి సహకరించాలని కోరుతున్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మహిళ మెడలో బంగారం చోరీ
సోమల మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో సచివాలయం సమీపంలో నివాసమున్న 80 ఏళ్ల చెన్నమ్మ వద్ద...
By Kothuru Murali 2026-04-02 06:36:59 0 162
SURAKSHA
Geethanjali Sharma, IAS: Empowering Governance with Vision
A Dedicated Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-11 11:46:48 0 148
Andhra Pradesh
పుంగనూరు: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి
విజయ కుమారి, శివ రత్నమ్మ గురువారం కలమందలవారిపల్లి ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవానికి హాజరయ్యారు....
By Kothuru Murali 2026-04-22 14:38:03 0 108
Sikkim
Final Railway Survey Approved for Melli–Dentam Line in Sikkim
The Ministry of Railways has approved the final location survey for a proposed Melli-to-Dentam...
By Bharat Aawaz 2025-07-17 07:29:54 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కారు ఢీకొని వ్యక్తి పరిస్థితి విషమం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో...
By Kothuru Murali 2026-04-10 04:54:50 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com