బహిరంగ సభ ముగించుకొని ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

0
253

మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమురంభీమ్ ఆసిఫాబాద్ సభ ముగించుకొని నేరుగా  కొక్కిరాల ప్రేమ్సా గర్ రావు నివాసానికి చేరుకున్నారు,మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రేమ్ సాగర్ రావు ప్రాధాన్యత మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిఫాబాద్ పర్యటన అనంతరం ప్రత్యేకంగా ఎమ్మెల్యే నివాసానికి వెళ్లడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందా అనే దానిపై చర్చ కొనసాగుతోంది,ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధి, పెండింగ్ సమస్యలు, పార్టీ బలోపేతంపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లా ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది,ముఖ్యమంత్రి రాకతో ప్రేమ్ సాగర్ రావు అనుచరుల్లో ఆనందం వెల్లివిరిసింది. “మంచిర్యాల ప్రజల స్వరం రాష్ట్ర స్థాయిలో బలంగా వినిపిస్తోంది” అంటూ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు...
By Rajini Kumari 2026-03-06 01:50:15 0 174
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 206
Telangana
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
By Terli Ashok 2026-01-25 09:31:18 0 216
Telangana
"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో...
By Sidhu Maroju 2026-06-06 06:25:57 0 272
Andhra Pradesh
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు అధికారులను ఆదేశించారు.
బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం...
By Gadiyapudi Narendra 2026-01-22 12:38:49 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com