వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్.

0
75

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు

హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం

సర్వదర్శనానికి 12 గంటల సమయం

కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ లైన్లు బయటకు

తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు 

తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తడంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 89,403 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. ఒక్కరోజే రూ.4.99 కోట్లు కానుకల రూపంలో వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.

 

వివిధ విభాగాల వారీగా టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, బుధవారం 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదేవిధంగా, 4.22 లక్షల శ్రీవారి లడ్డూలను విక్రయించారు. తిరుమలకు వచ్చే భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాన్ని 2.52 లక్షల మంది స్వీకరించగా, 3,603 మందికి వైద్య సేవలు అందించారు.

 

భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించాయి. సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం: రతన్ టాటా గారికి పచ్చని నివాళి
🌿 మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం: రతన్ టాటా గారికి పచ్చని నివాళి 🌿 శ్రీ హరిహరసుత మహాగణపతి...
By Venugopal Gopal 2025-12-28 15:55:53 0 622
Andhra Pradesh
నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం.
పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే...
By Pagadala Venkateswar 2026-05-22 05:33:37 0 94
Andhra Pradesh
నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం
*Photos :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం,...
By Rajini Kumari 2026-03-10 08:49:50 0 173
Telangana
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
By Ponnala Srinivasrao 2026-03-16 11:07:20 0 250
Telangana
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో...
By Bheeshman King 2026-07-08 14:22:39 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com