కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ

0
288

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 62 మంది నిరుపేద లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, ఒక ఇంటిలో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం కైతలాపూర్ లో జరిగింది.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో పట్టాల పంపిణీ చేపట్టారు.

కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో పాటు ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కలెక్టర్ మనో చౌదరి, జోనల్ కమిషనర్, ఎమ్మార్వో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   నిరుపేదలకు గృహ వసతి కల్పించడం, మహిళల ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల కేటాయింపు, మహిళా సంఘాలకు బస్సుల అందజేత వంటి పథకాల ద్వారా మహిళల సాధికారతకు కృషి చేస్తోందన్నారు. అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో నిరుపేదలు ఉన్నారని, వారికి మరిన్ని నిధులు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని విస్తరించాలని మంత్రిని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నీటి పొదుపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం.
ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ముందస్తు...
By Pagadala Venkateswar 2026-07-01 04:45:19 0 66
Andhra Pradesh
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్.
అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ...
By Pagadala Venkateswar 2026-05-12 05:49:27 0 97
Goa
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
By Bharat Aawaz 2025-07-17 06:22:44 0 1K
Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ:*   *ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-02-10 10:24:43 0 172
Telangana
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : కుమార్ దీపక్ ఐఏఎస్
మంచిర్యాల :ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృత్వం కార్యక్రమం...
By Avunoori Mahesh 2026-04-08 10:17:24 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com