"జింఖానా గ్రౌండ్స్‌లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.|

0
48

సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.

యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశంలో శాంతి, సామరస్యం నెలకొనాలంటే యువత దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి మానవ సంబంధాలు మరింత పరిపుష్టి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో పెద్ద కుటుంబాల్లో పెరిగిన పిల్లలు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారని, కానీ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాంటి తల్లిదండ్రుల ఆందోళనలను దూరం చేసి యువతలో సానుకూల మార్పు తీసుకురావడానికి “The Confluence – Rhythm of Bhakti” వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో G. కిషన్ రెడ్డి , N. రాంచందర్ రావు, తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. 

యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ నేర్చుకునే విలువలను జీవితంలో ఆచరించాలని ఈటల రాజేందర్ కోరారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతికి నివాళులర్పించిన: ఎమ్మెల్యే.
దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-03-11 03:16:05 0 125
Andhra Pradesh
ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*   * మంగళగిరి...
By Rajini Kumari 2026-02-20 23:18:49 0 123
Andhra Pradesh
అమరజీవి ఆశయ సాధనలో పయనించాలి: డీఆర్వో.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి అని అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-03-17 02:08:43 0 122
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి బోర్డు నిర్లక్ష్యం.. ప్రజల్లో అసహనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పాత బోర్డు...
By Pagadala Venkateswar 2026-03-20 10:34:40 0 130
Telangana
వరంగల్ భానుడు భగ భగ....60 మంది మృతి....!
భారత్ అవాజ్ న్యూస్ 24 రోజున వాతావరణ కేంద్రం తెలపడం జరిగిందిఉమ్మడి WGL జిల్లాలో భానుడు...
By Gujile Ramu 2026-05-24 01:51:44 0 20
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com