"జింఖానా గ్రౌండ్స్‌లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.|

0
209

సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.

యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశంలో శాంతి, సామరస్యం నెలకొనాలంటే యువత దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి మానవ సంబంధాలు మరింత పరిపుష్టి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో పెద్ద కుటుంబాల్లో పెరిగిన పిల్లలు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారని, కానీ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాంటి తల్లిదండ్రుల ఆందోళనలను దూరం చేసి యువతలో సానుకూల మార్పు తీసుకురావడానికి “The Confluence – Rhythm of Bhakti” వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో G. కిషన్ రెడ్డి , N. రాంచందర్ రావు, తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. 

యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ నేర్చుకునే విలువలను జీవితంలో ఆచరించాలని ఈటల రాజేందర్ కోరారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.
పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన...
By Pagadala Venkateswar 2026-05-02 04:18:22 0 92
Telangana
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ' బతుకమ్మ' గ్లింప్స్ ... శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను నాటి పరిస్థితులను, సాంకేతికతను...
By Ponnala Srinivasrao 2026-05-07 04:25:39 0 141
Andhra Pradesh
జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.
  జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ 16-06-2026 Tue  Andhra...
By Pagadala Venkateswar 2026-06-16 13:10:57 0 72
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
పుంగనూరు పట్టణంలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం...
By Kothuru Murali 2026-04-11 06:27:20 0 115
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ తల్లికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గారి సోదరుడు
ఈరోజు మొదలైన రాయలసీమకే తలమానికమైన అనంతపురం గంగమ్మ అమ్మవారి కి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు...
By Benguluri Madhubabu 2026-02-18 14:21:01 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com