కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:సిర్పూర్(యూ)మండలంలో నకిలీ పత్తి విత్తనాల ముఠా బట్టబయలు 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం ఇద్దరూ నిందితులపై కేసు నమోదు

0
139

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, 

జిల్లాలో నకిలీపత్తి విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన.వాహన తనిఖీల్లో 5.45 క్వింటళ్ల నకిలీవణి భావిస్తున్నా పత్తి విత్తనాలు.స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.శుక్రవారం సిర్పూర్ (యూ) పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్సై విక్రమ్. తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.వారి వద్ద నుంచి మొత్తం.68 కిలోల (152 ప్యాకెట్ల) పత్తి విత్తనాలు లభించాయి.ఒక్కో ప్యాకెట్ లో సుమారు 450 గ్రాముల చొప్పున విత్తనాలు ఉండగా వాటిపై ప్రభుత్వ ఆమోదిత వివరాలు,క్యూఆర్ కోడ్, హాలోగ్రామ్,లాట్ నెంబర్ వంటి గుర్తింపులు లేకపోవడం గమనించారు.దీంతో వెంటనే వ్యవసాయ శాఖ అధికారి (AO)ఆనందరావుకు సమాచారం అందించగా,ఆయన స్వయంగా పరిశీలించి వాటిని నకిలీ పత్తి విత్తనాలుగా నిర్ధారించారు. అనంతరం పోలీసులు చట్టభద్ధంగా సాక్షుల సమక్షంలో "పంచనామ" నిర్వహించి కేసు నమోదు చేశారు.ఈ కేసుపై ఆసిఫాబాద్  సబ్ డివిజన్ డిఎస్పి అశోక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాగా.గత రెండు నెలలుగా సిర్పూర్ మండల పరిధిలో సుమారు 6.75 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలను లాభాపేక్షణతో రైతులకు సరఫరా చేయాలని తీసుకురాగా నిందితుడు నైతం జంగు ఇంటి వద్ద మరో (1100 ప్యాకెట్స్) 4.90 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోగా మొత్తం  5.45 కింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం పరచుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులు వెల్లడించిన కేసులో నిందితుల వివరాలు:

A1) మంగునాథ్ సుమంధరనాథ్, వయస్సు:64 సంవత్సరాలు,వృత్తి: వ్యాపారం నివాసం: జూనాపాని మధ్యప్రదేశ్ ప్రస్తుతం: ఇంద్రవెల్లి.ఆదిలాబాద్ జిల్లా. A2) నైతం జంగు S/o నానాజీ వయసు: 40 సంవత్సరాలు, వృత్తి: మేస్త్రి.నివాసం: సిర్పూర్ యూ, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. 

 A1,A2 లను అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన డిఎస్పి అశోక్, ఎస్సై విక్రమ్కా,నిస్టేబుల్ నాగేంద్రబాబు, నాగేంద్ర లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

 రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభూత్వ అనుమతులు ఉన్నవిక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.నకిలీ విత్తనాల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం తెలియజేయాలని సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే...
By John Baji 2026-02-11 06:40:27 0 295
Andhra Pradesh
మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా
మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త...
By Pagadala Venkateswar 2026-01-25 12:33:40 0 132
Andhra Pradesh
.పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం
ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-04-21 14:57:16 0 63
Andhra Pradesh
మహిళా పరిశ్రమకు వ్యక్తుల ఎం ఓ యు
Ratan Tata Innovation Hub , ఎనికేపాడు విజయవాడ ALEAP WEKART 2026లో పాల్గొన్న RTIH – మహిళా...
By Rajini Kumari 2026-03-26 13:41:48 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com