నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం.
పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే ప్రారంభం కావాలని ఆదేశం
ఎస్ఐపీబీ ద్వారా రూ.11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం
ఇప్పటికే 114 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వెల్లడించిన అధికారులు
అనుమతులు, భూ కేటాయింపులు వేగవంతం చేయాలని సీఎం సూచన
రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు (ఎంవోయూలు), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై ఆయన గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీకి సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు ఎస్ఐపీబీ ద్వారా రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని చంద్రబాబు గుర్తుచేశారు. వీటిలో 114 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని (గ్రౌండింగ్ అయ్యాయని) అధికారులు సమావేశంలో వివరించారు.
మిగిలిన ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. వాటికి అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియను వేగవంతం చేసి, అవి కూడా త్వరగా గ్రౌండింగ్కు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy