అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్

0
186

చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం దారుణంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోలవరం జిల్లా చింతూరులో రాబోయే నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు (Heat waves) వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం 44 డిగ్రీలు నమోదయ్యాయి ముఖ్యంగా ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప ఆ సమయాల్లో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు (గొడుగు, మంచి నీళ్లు, తలకి రుమాలు వంటివి) తీసుకోండి ప్రాణం కంటే ఏ పనీ ఎక్కువ కాదు కాబట్టి ఎండ తీవ్రత తగ్గేవరకు కాస్త ఓపిక పట్టండి, సురక్షితంగా ఉండండి అని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకి తెలియజేశారు.

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
By Manda Ramkumar 2026-03-28 09:00:03 0 418
Andhra Pradesh
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు
యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు...
By Chennaiah Kati 2026-07-22 15:25:06 0 28
SURAKSHA
మహిళా రక్షణ: 'మహిళా మిత్ర' బృందాల పనితీరు
మహిళల భద్రత మరియు రక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ ప్రారంభించిన అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమం...
By Kalaga Sailaja 2026-06-26 10:23:30 0 69
Telangana
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
By Ponnala Srinivasrao 2026-05-02 02:54:42 0 114
Business & Finance
Bengaluru Leads India’s Housing Growth Market
Bengaluru has emerged as India’s leading housing growth market in Q2 2026, according to a...
By Navya Sree 2026-07-01 13:15:26 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com