రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.

0
71

నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి

తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన చంద్రబాబు దంపతుల వాహనం

సాక్షాత్తు సీఎం తన వద్దకు రావడంతో ఆనందంలో మునిగిపోయిన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తులు

కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్తున్న క్రమంలో, రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా కారు దిగి, వారి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే నిలబడి ఎంతో ఆప్యాయంగా తింటూ ముచ్చటించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చి సాదాసీదాగా మాట్లాడటంతో ఆ కార్మికుడు ఆనందంలో మునిగిపోయాడు.

 

 

ఈ అరుదైన క్షణాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కల్తీ లేదు... కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది" అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తాటి ముంజలు అమ్మే వ్యక్తి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం, యోగక్షేమాల గురించి సీఎం దంపతులు అడిగి తెలుసుకున్నారు. సీఎం దంపతులు చూపిన ఈ నిరాడంబరత, అప్యాయతలపై స్థానికులు ప్రశంసలు కురిపించగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
వరసగా మ హిళా దినోత్సవము లు
రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో...
By Mobbu Venkatramana 2026-03-07 12:12:09 0 437
SURAKSHA
Satish Kumar IPS: Leading with Courage and Commitment
The Journey begins "The strength of a police force is measured not only by its ability to fight...
By Fathima Safa 2026-07-23 07:32:18 0 28
Tamilnadu
Tamil Nadu Preserves Temples and Restores Heritage Sites
Tamil Nadu continues to prioritize temple administration and heritage restoration through...
By Fathima Safa 2026-06-29 10:41:44 0 45
Andhra Pradesh
మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!
కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్...
By Hari Krishna 2025-12-30 00:47:33 0 234
Andhra Pradesh
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు
.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం...
By Kothuru Murali 2026-04-03 09:28:03 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com