అర్హులందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

0
136

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి బుధవారం 39వ డివిజన్ నేతాజీ నగర్‌లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…*

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ప్రతి నెలా నిర్విరామంగా, ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన అందజేయాల్సిన పెన్షన్లను ఈసారి ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా 31వ తేదీకే ముందుగానే అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గతంలో పెన్షన్ తీసుకుంటూ మృతి చెందిన లబ్ధిదారుల పెన్షన్లను వారి భార్యలకు వితంతు పెన్షన్ లాగా మంజూరు చేయడం జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా, మానవీయంగా అమలు అవుతుందని తెలిపారు.

ఆర్థిక భారం ఎంత ఉన్నప్పటికీ, పేద కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సామాజిక పెన్షన్ మొత్తాన్ని రూ.4000కి పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం పేదల పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వివిధ కేటగిరీలలో దాదాపు 21 వేల మందికి సామాజిక పెన్షన్లు అందజేయబడుతున్నాయని, ఇంకా అర్హులైన వారు ఎవరికైనా మిగిలి ఉంటే రానున్న రోజుల్లో వారిని కూడా ఈ పథకంలో చేర్చి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో వ్యక్తిగత ద్వేషాలతో, రాజకీయ కారణాలతో తొలగించబడిన పెన్షన్లను కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు.

*ఇటీవల కొందరు నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ…*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా, నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, అది ప్రతి ఒక్కరికీ కళ్లకు కనిపిస్తోందని అన్నారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని పూర్తిగా వెనక్కి నెట్టిన గత ప్రభుత్వం తమ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా, అస్తిత్వం కాపాడుకోవడానికి మాత్రమే దుష్ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.

వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకు స్పందించడం సమయ వృథా అని పేర్కొంటూ, ప్రజలందరూ అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి వీరయ్య, రుస్తుం బాబు, మొహమ్మద్ రఫీ, సుధారాణి, తోట వెంకటేస్వర్లు,ఖాదర్ బుడే తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. బాసర తరహాలో తిరుపతిలో అక్షరాభ్యాసం సౌకర్యం.
వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం 'అక్షర గోవిందం' పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం...
By Pagadala Venkateswar 2026-03-13 07:31:36 0 149
Telangana
మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత… ఫుట్‌పాత్ షాపుల తొలగింపు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
By Sidhu Maroju 2026-04-08 12:04:37 0 148
Andhra Pradesh
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము
*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఇంధన పొదుపు...
By Rajini Kumari 2025-12-15 07:35:34 0 196
Andhra Pradesh
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం.
కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.3.9 కోట్ల...
By Pagadala Venkateswar 2026-01-22 14:37:56 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com