లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం

0
42

లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం

 

లక్సెట్టిపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది పాత బస్టాండ్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, వాహన పత్రాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.కార్డన్ సెర్చ్ అనంతరం స్థానిక ప్రజలకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపవద్దని హెచ్చరించారు.వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలివెళ్లవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట ఎస్సై సురేష్ కుమార్, దండేపల్లి ఎస్సై తైసీనోద్దీన్,జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: దంపతులపై దాడి కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో...
By Pagadala Venkateswar 2026-02-21 11:09:45 0 124
Andhra Pradesh
వెబ్‌ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ సమస్యలను...
By Pagadala Venkateswar 2026-03-24 03:38:58 0 129
Telangana
నేలకొండపల్లి లో కొనసాగుతున పోలింగ్...!
మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కాగా పళ్ళు కేంద్రాలు వద్ద ఉదయం 7: 00...
By Krishna Balina 2025-12-14 05:46:43 1 445
Telangana
వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్...
By Avunoori Mahesh 2026-05-06 15:18:46 0 121
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:48 0 33
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com