లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం

0
182

లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం

 

లక్సెట్టిపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది పాత బస్టాండ్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, వాహన పత్రాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.కార్డన్ సెర్చ్ అనంతరం స్థానిక ప్రజలకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపవద్దని హెచ్చరించారు.వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలివెళ్లవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట ఎస్సై సురేష్ కుమార్, దండేపల్లి ఎస్సై తైసీనోద్దీన్,జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP TET-2025: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలను శుక్రవారం నాడు మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. తన...
By Pagadala Venkateswar 2026-01-09 14:49:33 0 206
Telangana
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని ఆర్జిత...
By Mitappaly Shiavji 2026-01-04 09:58:17 0 521
Andhra Pradesh
చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు
తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ...
By Boiena Rajesh 2026-03-01 03:28:27 0 196
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 107
Telangana
ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జూలై 18, 2026 మంచిర్యాల జిల్లా  :ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన...
By Avunoori Mahesh 2026-07-18 14:11:57 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com