తల్లితండ్రులను దైవంగా భావించాలి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

0
303

 యువత తల్లిదండ్రులను దైవంలా భావించి వారి ఆశీస్సులతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విద్యార్థి విభాగం సమీక్షా సమావేశంలో మాధవరం కృష్ణారావు మాట్లాడారు.

యువత నేడు అన్ని రంగాల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం, నిబద్ధత చాలా ముఖ్యమని తెలిపారు. సమాజంలో ఎంతో మంది గొప్ప నాయకులు కష్టపడుతూ ఎదిగారని, తాను కూడా ఒక కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

కెసిఆర్  మరియు కేటీఆర్ నాయకత్వంలో బి ఆర్ ఎస్  పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.

అలాగే రాహుల్ గాంధీ తెలంగాణకు  వచ్చిన సమయంలో వేలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువత మరియు ఉద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. SIR పేరుతో ఓట్ల తొలగింపులపై యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కూకట్పల్లి నియోజకవర్గంలో జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11 వేల మంది విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలతో కూడిన ఉచిత కిట్లు అందించామని గుర్తు చేశారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని, తల్లిదండ్రుల మాట వినడం ద్వారా జీవితంలో మంచి మార్గంలో ముందుకు సాగవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 25 తేదీన  కేటీఆర్  అధ్యక్షతన జరిగే బి ఆర్ ఎస్  పార్టీ కార్యకర్తల సమావేశానికి భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థి విభాగ ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్ మరియు వివిధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పిజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం వద్దు: ఎస్పీ
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-20 06:15:49 0 177
Andhra Pradesh
శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు
  మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట...
By Boya Dasthagiri 2026-03-25 13:07:53 0 281
Uttar Pradesh
Mission "Deep Tech Capital": UP Accelerates Infrastructure & Innovation
Uttar Pradesh is rapidly transitioning into India's "Deep Tech Capital," as highlighted by recent...
By Dunna Jessicaruth 2026-05-14 08:54:14 0 89
Media Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy Journalism is more than just...
By Media Academy 2025-04-29 04:47:42 0 4K
Andhra Pradesh
ఒంటరి ఏనుగు పంటల పై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. పాలెం పంచాయితీ...
By Kothuru Murali 2025-12-30 12:40:12 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com