తల్లితండ్రులను దైవంగా భావించాలి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

0
300

 యువత తల్లిదండ్రులను దైవంలా భావించి వారి ఆశీస్సులతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విద్యార్థి విభాగం సమీక్షా సమావేశంలో మాధవరం కృష్ణారావు మాట్లాడారు.

యువత నేడు అన్ని రంగాల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం, నిబద్ధత చాలా ముఖ్యమని తెలిపారు. సమాజంలో ఎంతో మంది గొప్ప నాయకులు కష్టపడుతూ ఎదిగారని, తాను కూడా ఒక కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

కెసిఆర్  మరియు కేటీఆర్ నాయకత్వంలో బి ఆర్ ఎస్  పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.

అలాగే రాహుల్ గాంధీ తెలంగాణకు  వచ్చిన సమయంలో వేలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువత మరియు ఉద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. SIR పేరుతో ఓట్ల తొలగింపులపై యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కూకట్పల్లి నియోజకవర్గంలో జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11 వేల మంది విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలతో కూడిన ఉచిత కిట్లు అందించామని గుర్తు చేశారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని, తల్లిదండ్రుల మాట వినడం ద్వారా జీవితంలో మంచి మార్గంలో ముందుకు సాగవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 25 తేదీన  కేటీఆర్  అధ్యక్షతన జరిగే బి ఆర్ ఎస్  పార్టీ కార్యకర్తల సమావేశానికి భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థి విభాగ ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్ మరియు వివిధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ప్రచునార్థం  19.1.26     *రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన...
By Rajini Kumari 2026-01-19 11:30:29 0 168
Andhra Pradesh
పోలీస్ శాఖ పరిపాలనలో భాగంగా ఈ ఆఫీస్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్
బాపట్ల: పోలీస్ శాఖ పరిపాలనలో భాగంగా ఈ ఆఫీస్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-17 16:48:43 0 263
Andhra Pradesh
500నోట్లు రద్దు ప్రచారం ‌నిజం లేదు ఆర్.బి.ఐ స్పష్టత
500నోటికి కాలం చెల్లిందని దేశంలో మార్చి నుంచి 500నోట్లు రద్దు కానున్నాయి అన్ని రక రకాల పుకార్లు...
By Karapati Gopi 2026-01-03 01:36:23 0 716
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: భక్తుల రాకకు భారీ ఏర్పాట్లు
ఏప్రిల్ 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా...
By Kothuru Murali 2026-03-28 06:05:06 0 164
Andhra Pradesh
గంజాయి గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్.
మదనపల్లె పరిసరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో...
By Pagadala Venkateswar 2026-04-11 12:53:56 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com