ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.

0
85

 

ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్

 Andhra

AP Government Releases 919 Crore for NTR Vaidya Seva Private Hospital Dues

నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేశామన్న సత్యకుమార్

785 ప్రైవేట్ ఆసుపత్రులకు నిధులు అందాయని విడుదల

ఇప్పటి వరకు మొత్తం రూ. 5,556 కోట్లు విడుదల చేశామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవల బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం ప్రభుత్వం రూ. 919.13 కోట్లను విడుదల చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 

 

ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో భాగంగా ఈ నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన వివరించారు. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 785 ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నిధులు అందాయని తెలిపారు. 

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం రూ. 5,556 కోట్లను చెల్లించామని, బకాయిల చెల్లింపుల హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన నివేదికను ట్రస్టు సీఈఓ చక్రధరబాబు మంత్రికి అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మణిపాల్ హాస్పిటల్ నుంచి విజయవాడకు వెళ్లిన గవర్నర్
మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్   వైద్య పరీక్షల్లో కిడ్నీలో...
By Rajini Kumari 2026-04-25 12:09:23 0 171
Mizoram
Mizoram Faces Worrying Surge in TB Cases and Deaths
A sharp rise in public health metrics has sparked widespread concern across Mizoram after state...
By Lokeshwari Panthadi 2026-06-26 07:27:25 0 40
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 11:08:34 0 143
Andhra Pradesh
కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.
మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత...
By Pagadala Venkateswar 2026-05-16 05:01:55 0 90
Odisha
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...
By Bharat Aawaz 2025-07-17 08:30:18 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com