చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.

0
38

అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో ఘటన

ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

ఆపదలో ఉన్నామని ఆదుకోవాలని కోరిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి అండగా నిలిచారు. వినతి స్వీకరించిన 24 గంటల్లోనే సహాయం మంజూరు చేసి, తన మార్క్ పాలనను మరోసారి చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 16న 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నరసన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన గొర్లె జ్యోతి, సింహాద్రి భాస్కరరావు దంపతులు సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నామని, వైద్య ఖర్చులకు ఉన్నదంతా అయిపోయిందని, తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వారి పరిస్థితికి వెంటనే చలించిన చంద్రబాబు, తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 

ఆయన చెప్పినట్టుగానే, మరుసటి రోజే (మే 17న) ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి శ్రీకాకుళం కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. బాధితులిద్దరికీ సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఈ చెక్కులను నిన్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎం సహాయ నిధి ద్వారా రూ. 3 కోట్లు అందించామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
,కూటమి ప్రభుత్వం రైతన్నల కల,
- _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు - డోర్ టు...
By Boya Dasthagiri 2026-03-24 00:50:52 0 300
Telangana
అటవీశాఖ అర్బన్ పార్క్ లో కోతుల ఆహారపు కేంద్రం ఏర్పాటు.
 మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో వున్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోతుల...
By Gangaram Rangagowni 2026-01-12 09:02:42 0 516
Nagaland
Jakhama Hosts 3rd Potato Festival
The third edition of the popular Nagaland Potato Festival 2026 took place at the Jakhama Village...
By Dunna Jessicaruth 2026-05-16 07:04:16 0 70
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో...
By Kothuru Murali 2026-03-09 08:04:14 0 191
Prop News
Redefining Real Estate with Transparency & Trust
Real estate is one of the most significant industries in the world, yet it remains complex,...
By Hazu MD. 2025-05-19 11:32:11 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com