"సెల్‌ఫోన్ డ్రైవర్లపై ఉక్కుపాదం.. రూ.13 లక్షలకు పైగా జరిమానాలు.|

0
169

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 

కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్కరోజులోనే 1,340 కేసులు నమోదు చేసి రూ.13.39 లక్షల జరిమానాలు విధించారు. 

ప్రధాన కూడళ్లు, సిగ్నల్ పాయింట్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు.

C.P. బి. సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ జోన్-I, జోన్-II పరిధిలో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగింది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌లో మాట్లాడటం, మెసేజ్‌లు పంపడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియా వినియోగించడం వంటి ప్రమాదకర చర్యలను పోలీసులు ప్రత్యేకంగా గుర్తించి కేసులు నమోదు చేశారు.

సెల్‌ఫోన్ వాడకం వల్ల డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు.

“ఒక ఫోన్ కాల్ కాసేపు ఆగుతుంది… కానీ ఒక ప్రమాదం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది” అంటూ డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. 

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి ఫోన్ మాట్లాడాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

కమిషనరేట్ వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు ఇకపై కూడా నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు.
    వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం...
By Pagadala Venkateswar 2026-04-28 05:57:51 0 115
Telangana
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...
By Sidhu Maroju 2026-03-28 06:50:31 0 189
Andhra Pradesh
ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత
ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి...
By Boya Dasthagiri 2026-04-20 11:33:56 0 207
Andhra Pradesh
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.
          Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి:...
By Pagadala Venkateswar 2026-02-02 05:03:38 0 150
Telangana
భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల  నగదు...
By Sidhu Maroju 2025-12-05 10:38:45 0 325
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com