"సెల్‌ఫోన్ డ్రైవర్లపై ఉక్కుపాదం.. రూ.13 లక్షలకు పైగా జరిమానాలు.|

0
85

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 

కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్కరోజులోనే 1,340 కేసులు నమోదు చేసి రూ.13.39 లక్షల జరిమానాలు విధించారు. 

ప్రధాన కూడళ్లు, సిగ్నల్ పాయింట్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు.

C.P. బి. సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ జోన్-I, జోన్-II పరిధిలో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగింది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌లో మాట్లాడటం, మెసేజ్‌లు పంపడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియా వినియోగించడం వంటి ప్రమాదకర చర్యలను పోలీసులు ప్రత్యేకంగా గుర్తించి కేసులు నమోదు చేశారు.

సెల్‌ఫోన్ వాడకం వల్ల డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు.

“ఒక ఫోన్ కాల్ కాసేపు ఆగుతుంది… కానీ ఒక ప్రమాదం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది” అంటూ డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. 

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి ఫోన్ మాట్లాడాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

కమిషనరేట్ వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు ఇకపై కూడా నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
ఈ నెల 10 నుంచి టీసీసీ ఎగ్జామ్స్
TG: రాష్ట్రంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్షలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు...
By Mitappaly Shiavji 2026-01-05 01:08:45 0 369
Andhra Pradesh
స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.
కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు...
By Pagadala Venkateswar 2026-05-19 13:02:41 0 31
Andhra Pradesh
నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ 75 మంది లబ్ధిదారులకు రూ.34.80 లక్షలు అందజేసిన...
By Patan Khuddus 2026-05-03 13:05:30 0 217
Andhra Pradesh
Nara Lokesh: బ్యాలెన్స్ కుదిరింది... కేంద్ర బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందన.
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించిన మంత్రి నారా లోకేశ్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని...
By Pagadala Venkateswar 2026-02-01 11:02:15 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com