పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.

0
35

Andhra

Pawan Kalyan Interesting comments by Niharika

పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా చూసుకుంటారన్న నిహారిక

ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే స్పందించారని వెల్లడి

325 మందికి సేఫ్టీ కిట్ అందజేసినట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మెగా డాటర్ కొణిదెల నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలను ఆయన తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారని అన్నారు. పిఠాపురం వెళితే తనకు తన సొంతూరుకు వెళ్ళినట్లుగా అనిపిస్తుందని అన్నారు.

 

తన నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే నియోజకవర్గంలోని ఎలక్ట్రిషియన్లందరికీ పవన్ కల్యాణ్ సేఫ్టీ కిట్లు అందజేశారని తెలిపారు. మొత్తం 325 మందికి భద్రతా కిట్లను అందజేసినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల సకాలంలో స్పందించడంలో ఆయనకు ఎవరూ సాటిరారని అన్నారు.

Search
Categories
Read More
Telangana
హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు
కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే...
By Ponnala Srinivasrao 2026-04-24 00:30:53 0 80
Andhra Pradesh
Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల అప్రమత్తం.
సచివాలయంలోని కందుల దుర్గేశ్ పేషీకి లేఖ దుర్గేశ్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని...
By Pagadala Venkateswar 2026-02-11 07:36:37 0 109
Andhra Pradesh
పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ...
By Kothuru Murali 2026-03-06 11:52:52 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com