ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.

0
74

ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు 16,000 ఇ-సైకిళ్లు

ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

సులువైన రుణాల కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం

రాష్ట్రంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సాహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ఒక ఉద్యమంగా మార్చాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి అందించాలని నిర్ణయించారు.

 

సోమవారం నాడు సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ సైకిళ్లు, వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యాలయ సిబ్బందికి అందించే 16,000 ఇ-సైకిళ్లను సులభ వాయిదాల (ఈఎంఐ) పద్ధతిలో ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

 

సామాన్యులు కూడా ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా రుణాలు అందించేందుకు ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలన్నారు. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Telangana
నిజామాబాద్
అలిండియా అర్గానైజేషన్ అఫ్  కెమిష్ట్ డ్రాగిస్ట్(AIOCD) పిలుపు మెరాకు ఈరోజు దేశవ్యప్తంగ రిటైల్...
By Sadaq Sadaq 2026-05-20 13:41:56 0 103
Andhra Pradesh
పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*   ఒడిశా : ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే...
By Rajini Kumari 2026-04-13 08:11:57 0 138
Andhra Pradesh
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు...
By BABJI DADALA 2026-01-27 14:20:22 0 523
Business & Finance
Proprietorship Registration Simplifies Business Setup
Proprietorship Registration is the simplest way to start and manage a business as a single owner....
By Navya Sree 2026-07-22 05:09:38 0 25
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com