ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.

0
35

ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు 16,000 ఇ-సైకిళ్లు

ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

సులువైన రుణాల కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం

రాష్ట్రంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సాహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ఒక ఉద్యమంగా మార్చాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి అందించాలని నిర్ణయించారు.

 

సోమవారం నాడు సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ సైకిళ్లు, వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యాలయ సిబ్బందికి అందించే 16,000 ఇ-సైకిళ్లను సులభ వాయిదాల (ఈఎంఐ) పద్ధతిలో ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

 

సామాన్యులు కూడా ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా రుణాలు అందించేందుకు ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలన్నారు. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Karnataka
ಕೇಸಿಇಟೆ 2025 ರೌಂಡ್ 3 ಹುದ್ದೆ ಹಂಚಿಕೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ
ಕರ್ನಾಟಕ ಪರೀಕ್ಷಾ ಪ್ರಾಧಿಕಾರವು (KEA) ಕೇಸಿಇಟೆ 2025 ರೌಂಡ್ 3 ಹುದ್ದೆ ಹಂಚಿಕೆ ಫಲಿತಾಂಶವನ್ನು ಅಧಿಕೃತವಾಗಿ...
By Pooja Patil 2025-09-11 09:35:52 0 232
Andhra Pradesh
తెలంగాణ సీఎం ని కలిసిన ఆంధ్ర ఐటీ మినిస్టర్
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్...
By Rajini Kumari 2026-01-22 12:01:55 0 163
Andhra Pradesh
విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్...
By Boiena Rajesh 2026-04-12 00:17:57 0 104
Andhra Pradesh
ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం  ...
By Rajini Kumari 2026-03-30 04:59:14 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com