నిజామాబాద్

0
58

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ

 

— డా. కవిత రెడ్డి

IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌

 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో Government General Hospital, Nizamabadలో అధునాతన గుండె వైద్య సేవలను బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది.

 

ఆసుపత్రిలో ఈ రోజు తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడింది. తరచూ స్పృహ తప్పే సమస్యతో బాధపడుతున్న శ్రీ యాదయ్యకు కార్డియాలజీ మరియు వైద్య బృందం సమన్వయంతో యాంజియోగ్రామ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడం నిజామాబాద్ జిల్లా వైద్య రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

 

ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆధునిక గుండె వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

 

ఇదే సమయంలో ఆసుపత్రిలో కార్డియాలజిస్టుల కొరత, క్యాథ్ ల్యాబ్ పనిచేయకపోవడం వంటి సమస్యలను  ఆరోగ్య శాఖ మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లా రు. వెంటనే స్పందించిన మంత్రి గారు ముగ్గురు కార్డియాలజిస్టులను డిప్యూటేషన్‌పై నియమించడం అభినందనీయం.ప్రజలకు నాణ్యమైన గుండె వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్...
By BABJI DADALA 2026-01-12 15:18:43 0 414
Telangana
బల్కంపేట ఆలయానికి కోటి రూపాయలు విరాళం అందించిన నితా అంబానీ
బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ విరాళం బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత...
By Vadla Egonda 2025-06-21 01:34:05 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
By Kothuru Murali 2026-02-09 07:37:07 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com