అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్‌!

0
59

గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం ద్వారా ద్వాక్రా మహిళలకు భారీ లబ్ధి చేకూరనుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం చింతూరు మండలం గొందిగూడెంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణతో పాటు స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరిగిన వెదురును విక్రయించగా వచ్చే ఆదాయంలో.. సగం ఆదాయాన్ని (50% షేర్) నేరుగా మహిళలకే అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.11 గిరిజన గ్రామాలకు చెందిన 119 డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న 1154 మంది మహిళలకు ఆదాయం లభిస్తుందని తెలిపారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
నర్స్ వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదే- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్...
By Sidhu Maroju 2025-12-19 16:26:04 0 191
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 113
Telangana
నర్సంపేట డిపో పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల సహాయం చేయడం జరిగింది
నర్సంపేట: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం.... భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ....
By Gujile Ramu 2026-05-04 17:34:30 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com