కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ

0
123

Avja కృష్ణా 

 

కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ 

 

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారూ ... కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, ఒక్కో బస్సు ధర సుమారు రూ. 1.60 కోట్ల నుండి రూ. 1.70 కోట్ల వరకు పలుకుతోందని తెలిపారు.

ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి బస్సులను కొనుగోలు చేయడం ప్రస్తుతానికి ఆర్టీసీ లేదా ప్రభుత్వానికి సాధ్యం కాని పని అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తే, వారే పెట్టుబడులు పెట్టి, బాడీ బిల్డింగ్ చేయించుకుని బస్సులను నడుపుతారని, దీనివల్ల ఆర్టీసీపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.

ఆర్థిక భారం.. ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకత

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 10వేల బస్సులు నడుస్తున్నాయని, వాటన్నింటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలంటే దాదాపు రూ. 15, వేల కోట్లు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీపై ఇప్పటికే ఆర్థిక భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్ల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.

అయితే, ప్రయాణికులకు ఛార్జీలు పెంచే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చు చాలా తక్కువని ఆయన వివరించారు

ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, నిర్వహణ వ్యయం తగ్గి ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయనీ చెప్పారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశంలో మన 39వ డివిజన్ కార్పోరేటర్ దంపాలి మురళీకృష్ణ  ప్రజలు...
By Sadaq Sadaq 2026-07-02 09:39:35 0 112
Telangana
టామ్కామ్ను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 20: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-05-20 07:04:55 0 168
Andhra Pradesh
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
By Pagadala Venkateswar 2026-01-26 12:06:41 0 182
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా యోగి వేమన జయంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఘన నివాళి
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-19 11:44:52 0 186
Andhra Pradesh
పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్
చిత్తూరు జిల్లా అయ్యి కోఆర్డినేటర్ మధు, పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లలను పాఠశాలలో...
By Kothuru Murali 2026-05-19 15:25:52 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com