క్యూఆర్ కోడ్ ఆధారత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై ఒకటి రెండు మూడు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

0
110

విజయవాడ నగరపాలక సంస్థ

16-05-2026

 

 

*క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై సర్కిల్ 1, 2,3 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ*

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న “క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ” అమలుకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సర్కిల్ 1,2,3 సిబ్బందికి, ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల మీటింగ్ హాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు విడతలుగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శనివారం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన నిర్వహించారు. 

 

 

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీలు, వార్డు అమినిటీస్ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, సంబంధిత అధికారులకు శుక్రవారం నాడు శిక్షణ పొందిన ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. నగరంలోని ప్రతి ఆస్తికి సాంకేతిక ఆధారిత డిజిటల్ గుర్తింపును కల్పించడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పౌర సేవలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని డీసీ ఆర్ తెలిపారు. 

 

ఈ శిక్షణ కార్యక్రమంలో క్యూఆర్ కోడ్ ఆధారిత డోర్ నంబరింగ్ విధానం అమలు తీరు, యూఎల్బీ సరిహద్దుల నిర్ధారణ, రోడ్ల మ్యాపింగ్, ప్రతి ఆస్తి వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సెల్ మ్యాపింగ్, ఈఆర్‌పీ డేటా సమన్వయం, ఖచ్చితమైన భౌగోళిక గుర్తింపుల నమోదు తదితర అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రతి ఆస్తికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ జెనరేషన్, డిజిటల్ డేటా సమగ్రత, భవిష్యత్ పట్టణ ప్రణాళికలో ఈ సమాచార వినియోగం వంటి అంశాలపై కూడా సిర్కిల్ అధికారులకు మార్గదర్శకాలు అందించారు. 

 

 

 ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు ఏ యు బి శర్మ ,హెలెన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ప్లానింగ్, ఏమినిటీస్, అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు.

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-18 06:15:05 0 206
Odisha
MMPY Expansion: Mid-Day Meals for Classes 9 and 10
The Odisha government has announced a significant expansion of the Mukhyamantri Poshan Yojana...
By Lokeshwari Panthadi 2026-07-02 07:31:10 0 77
Andhra Pradesh
తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు...
By Pagadala Venkateswar 2026-04-23 03:42:31 0 101
Telangana
మార్చి నేలపై మీమ్స్ ఒక నెలలో ఇన్ని మార్పుల
జనవరి ఫిబ్రవరి నెలలు చిటికెలో గడిచిపోగా . మార్చి నేల మాత్రం నత్తనడకలా సాగుతుందని నెటింట మీమ్స్...
By MERIGE MALLESH 2026-03-27 12:50:16 0 345
Telangana
స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ...
By Avunoori Mahesh 2026-05-29 10:22:00 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com