"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|

0
182

హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్” కార్యక్రమంలో భాగంగా చిలకలగూడ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు వెంటనే స్పందించవద్దని సూచించారు. 

అలాగే తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్‌ను ఓపెన్ చేయరాదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.

బ్యాంకు అధికారులు లేదా పోలీసులమని నమ్మబలికి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా నిర్ధారణ లేకుండా గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపరాదని స్పష్టం చేశారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులను ఫ్రీజ్ చేసి, కోర్టు ప్రక్రియ ద్వారా బాధితులకు తిరిగి అందించే అవకాశం ఉంటుందని పోలీసులు వివరించారు.

ఈ కార్యక్రమంలో చిలుకలగూడ ఏసీపీ కే. శశాంక్ రెడ్డి, ఎస్ఐ రాకేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|
హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం...
By Avunoori Mahesh 2026-05-07 12:26:51 0 197
Karnataka
Political Shuffles: CM Siddaramaiah Headed to Delhi
Karnataka Chief Minister Siddaramaiah has been called to New Delhi for high-level meetings with...
By Dunna Jessicaruth 2026-05-25 06:16:20 0 127
Rajasthan
Protest to Preparation: Students Gear Up for June 21
While Jaipur’s Statue Circle saw massive student protests earlier today, the mood is...
By Dunna Jessicaruth 2026-05-15 06:22:53 0 136
Andhra Pradesh
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్...
By Pagadala Venkateswar 2026-06-13 10:45:47 0 67
Telangana
విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ
మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక...
By Bheeshman King 2026-05-07 10:14:55 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com