ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స.|

0
213

 

 

 

సికింద్రాబాద్ : వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని చెదరగొడుతూ, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే 72 ఏళ్ల వృద్ధురాలికి మిట్రల్ వాల్వ్ లీకేజీపై చికిత్స అందించ అరుదైన విజయం సాధించినట్లు సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు.

 

కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న పని చేసినా ఆయాసం, తీవ్ర అలసట వంటి సమస్యలు ఉండేవి. మొదట వీటిని వయస్సు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేశారు. అయితే పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

పరీక్షల్లో ఆమె మిట్రల్ వాల్వ్‌లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల ప్రకారం, భారతదేశంలో 65 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి 10 మందిలో ఒకరికి వాల్వ్ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉంది.

 

ఆమె వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రమాదకరమని భావించారు. దీంతో మల్టీడిసిప్లినరీ హార్ట్ టీమ్ కేసును సమగ్రంగా పరిశీలించింది.

 

కాథెటర్ ద్వారా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో చికిత్స నిర్వహించారు. కాలి రక్తనాళం ద్వారా చిన్న ట్యూబ్ పంపించి, ఆధునిక ఇమేజింగ్ సాయంతో వాల్వ్ లీకేజీని తగ్గించారు.

 

ఈ సందర్భంగా డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి మాట్లాడుతూ, “వృద్ధుల్లో కనిపించే ఆయాసం, అలసటను కేవలం వయస్సు కారణంగా భావించకూడదు. సకాలంలో పరీక్షలు చేయించుకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే ఆధునిక పద్ధతుల్లో సురక్షితంగా చికిత్స చేయవచ్చు. హార్ట్ టీమ్ సమిష్టి నిర్ణయం వల్ల ప్రతి రోగికి తగిన చికిత్సను ఎంపిక చేయడం సాధ్యమవుతోంది,” అన్నారు.

 

ప్రస్తుతం రోగి స్థిరంగా ఉండి, శ్వాసలో గణనీయమైన మెరుగుదలతో రోజువారీ పనులు స్వయంగా చేసుకుంటున్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం సహకారంతో ఇటువంటి అత్యాధునిక గుండె చికిత్సలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వైద్య బృందం తెలిపారు.

 

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో...
By Avunoori Mahesh 2026-04-10 12:18:18 0 196
Andhra Pradesh
పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు...
By Kothuru Murali 2026-01-30 04:47:34 0 157
Andhra Pradesh
పుంగనూరు: రాగి తీగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ తన వ్యవసాయ...
By Kothuru Murali 2026-04-21 14:49:14 0 102
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 166
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి....
By Pagadala Venkateswar 2026-06-12 14:21:58 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com