జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషి

0
189

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాల ను ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో tuwj iju యూనియన్, జాతీయ కార్యవర్గ సభ్యులు కుంజేటి సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అన్ని మండలాలలో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో యూనియన్ సభ్యత్వం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని యూనియన్ ప్రతినిధులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు జర్నలిస్టుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు యూనియన్ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో ఐజేయు యూనియన్ జిల్లా ప్రతినిధులు మల్లం వెంకటేశ్వర్లు,కొడారు బ్రహ్మం, దొడ్డ శ్రీధర్, ప్రెస్ క్లబ్ సభ్యులు గోవిందా చారి, సిద్దెల శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి జోన్స్, సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ.|
హైదరాబాద్ :  జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్  జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు...
By Sidhu Maroju 2025-12-25 18:33:29 0 225
Andhra Pradesh
తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై...
By Shyamala Yadagiri 2026-06-02 06:45:34 0 194
Telangana
కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు...
By Avunoori Mahesh 2026-04-20 03:52:37 0 173
Andaman & Nikobar Islands
Marine Safety Advisory Issued for Andaman Coast
The Andaman & Nicobar Administration has issued a marine safety advisory warning of high...
By Navya Sree 2026-06-27 06:57:57 0 81
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:15:46 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com