ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు...
భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు...
భయంతో కంపించిపోయిన కార్మికులు.. నిలిచిన నిర్మాణ పనులు
భారత్ అవాజ్ న్యూస్: 15 మే రోజున ఉదయం ములుగు జిల్లాలోని ప్రతిష్టాత్మక సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత ప్రాంగణ నిర్మాణ పనుల్లో అద్భుతమైన, అదే సమయంలో భీతిగొలిపే దృశ్యాలు చోటుచేసుకున్నాయి. వర్సిటీ ప్రహరీ గోడ పునాది కోసం జరుపుతున్న తవ్వకాల్లో శతాబ్దాల నాటి పురాతన కట్టడాల శిథిలాలు బయటపడగా, అదే సమయంలో భూగర్భం నుంచి భారీ పాములు ప్రత్యక్షమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వార్త తెలియడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు...
ప్రహరీ గోడ తవ్వకాల్లో పురాతన కట్టడాలు
విశ్వవిద్యాలయ ప్రాంగణం చుట్టూ సుమారు 8.07 కిలోమీటర్ల మేర శాశ్వత ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జేసీబీలతో పునాదుల కోసం లోతుగా తవ్వకాలు జరుపుతుండగా, భూగర్భంలో భారీ రాతి శిలలతో కూడిన నిర్మాణాలు బయటపడ్డాయి. ఇవి పురాతన ఆలయ తరహా నిర్మాణాలని, చెక్కిన రాళ్లు మరియు స్తంభాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి దగ్గరగా ఉండటంతో.. ఇవి కాకతీయుల కాలం నాటి ఉప ఆలయాలు లేదా ఆనాటి చారిత్రక కట్టడాల శిథిలాలు కావచ్చని భావిస్తున్నారు. ఈ ఆనవాళ్లు శతాబ్దాల నాటి ప్రాచీన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు....
భారీ సర్పాల ప్రత్యక్షం.. పనుల నిలిపివేత
తవ్వకాల సమయంలో కేవలం రాళ్లే కాకుండా, భూగర్భంలోని రాళ్ల సందుల నుండి అకస్మాత్తుగా భారీ నాగుపాములు, ఇతర పెద్ద సర్పాలు బయటకు వచ్చాయి. ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో పాములు ప్రత్యక్షమవడంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు, జేసీబీ ఆపరేటర్లు భయంతో పరుగులు తీశారు. పురాతన కట్టడాలు ఉన్న చోట పాములు ఉండటం దైవకార్యంగా కొందరు స్థానికులు భావిస్తుండగా, కార్మికులు మాత్రం ప్రాణభయంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆనవాళ్లపై పూర్తి స్థాయి స్పష్టత కోసం విశ్వవిద్యాలయ వర్గాలు మరియు స్థానిక రెవెన్యూ అధికారులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ కట్టడాలు ఏ కాలం నాటివి? వీటి వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? అనే విషయాలను నిపుణులు పరిశీలించనున్నారు. అప్పటి వరకు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని యథాతథంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ అరుదైన పరిణామంతో ములుగు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పురాతన కట్టడాల గురించే చర్చ జరుగుతోంది. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz