ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.

0
91

ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ

15-05-2026 Fri 08:14 | Andhra

AP Government New Pension Scheme for Chronic Diseases

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు

మొదటి విడతలో 965 మందికి నెలకు రూ.10 వేల చొప్పున సాయం

జూన్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ

పక్షవాతం, కండరాల వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15 వేల పింఛను

జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

ఏపీ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వేలాది మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 965 మందికి జూన్ 1 నుంచి నెలకు రూ.10,000 చొప్పున పింఛను అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఈ పింఛను డబ్బులను పంపిణీ చేయనున్నారు.

 

గతేడాది మార్చి తర్వాత కిడ్నీ, లివర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు బోదకాలు, కుష్టు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 965 దరఖాస్తులు రాగా, వాటన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త పింఛన్ల కోసం నెలకు రూ.93.34 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇకపై దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నుంచి దరఖాస్తులు వచ్చిన వెంటనే, వైద్యారోగ్య శాఖ ఆమోదంతో ఏ నెలకు ఆ నెలలోనే పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారు, కండరాల బలహీనత, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, తీవ్రమైన హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడేవారిని దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ కేటగిరీల కింద ఏపీలో 2025 మార్చి తర్వాత 1,217 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పింఛను మంజూరు కావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్ జారీ అయిన మరుసటి నెల నుంచే వీరికి పింఛను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఈ కేటగిరీలో పింఛన్ల మొత్తంలో కూడా వ్యత్యాసం ఉంది. తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10,000 అందిస్తారు. అదే సమయంలో పక్షవాతంతో పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి, తీవ్రమైన కండరాల వ్యాధులతో బాధపడేవారికి నెలకు రూ.15,000 చొప్పున పింఛను ఇవ్వనున్నారు. మరోవైపు అర్హులైన ఇతరుల కోసం జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన...
By Patan Khuddus 2026-04-21 09:02:37 0 288
Andhra Pradesh
సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.
చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన...
By Shyamala Yadagiri 2026-05-11 04:49:10 0 185
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.
మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే...
By Pagadala Venkateswar 2026-03-10 08:45:25 0 244
Andhra Pradesh
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-05 13:42:52 0 197
Andhra Pradesh
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026
రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు...
By Manda Ramkumar 2026-03-26 10:14:06 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com