ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.

0
52

ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ

15-05-2026 Fri 08:14 | Andhra

AP Government New Pension Scheme for Chronic Diseases

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు

మొదటి విడతలో 965 మందికి నెలకు రూ.10 వేల చొప్పున సాయం

జూన్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ

పక్షవాతం, కండరాల వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15 వేల పింఛను

జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

ఏపీ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వేలాది మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 965 మందికి జూన్ 1 నుంచి నెలకు రూ.10,000 చొప్పున పింఛను అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఈ పింఛను డబ్బులను పంపిణీ చేయనున్నారు.

 

గతేడాది మార్చి తర్వాత కిడ్నీ, లివర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు బోదకాలు, కుష్టు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 965 దరఖాస్తులు రాగా, వాటన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త పింఛన్ల కోసం నెలకు రూ.93.34 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇకపై దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నుంచి దరఖాస్తులు వచ్చిన వెంటనే, వైద్యారోగ్య శాఖ ఆమోదంతో ఏ నెలకు ఆ నెలలోనే పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారు, కండరాల బలహీనత, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, తీవ్రమైన హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడేవారిని దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ కేటగిరీల కింద ఏపీలో 2025 మార్చి తర్వాత 1,217 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పింఛను మంజూరు కావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్ జారీ అయిన మరుసటి నెల నుంచే వీరికి పింఛను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఈ కేటగిరీలో పింఛన్ల మొత్తంలో కూడా వ్యత్యాసం ఉంది. తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10,000 అందిస్తారు. అదే సమయంలో పక్షవాతంతో పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి, తీవ్రమైన కండరాల వ్యాధులతో బాధపడేవారికి నెలకు రూ.15,000 చొప్పున పింఛను ఇవ్వనున్నారు. మరోవైపు అర్హులైన ఇతరుల కోసం జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
By Kothuru Murali 2026-02-09 07:37:07 0 110
Andhra Pradesh
జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం...
By mahaboob basha 2025-06-14 14:43:16 0 1K
Andhra Pradesh
కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా/కొండ‌ప‌ల్లి,...
By Rajini Kumari 2026-02-07 12:15:32 0 135
West Bengal
EC Trains Officials Ahead of 2026 Assembly Elections |
The Election Commission (EC) has started training ADMs and EROs ahead of the May 2026 assembly...
By Pooja Patil 2025-09-16 04:35:18 0 665
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com