ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య....

0
52

ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య....

భారత్ అవాజ్ న్యూస్ 15 మే రోజున దుగ్గొండి మండలం» వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలి...  మల్లంపల్లిలో ఘనంగా బడిబాట.... ర్యాలీ, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కలెక్టర్ సత్య శారద... జిల్లా టాపర్ కావ్యశ్రీకి కలెక్టర్ సన్మానం....

దుగ్గొండి  ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన ఉన్నత విద్య అందుతుందని...

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై బడిబాట ర్యాలీ, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు సమతుల పౌష్టికాహారం, మౌలిక వసతులు, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ఉత్తమ బోధన అందుతోందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. మల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్లో చదివిన కావ్యశ్రీ ఎస్సెస్సీ పరీక్షల్లో 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ, జెడ్పీ పాఠశాలల విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈకార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు....

జిల్లా టాపర్ జనగాం కావ్యశ్రీ ఘన సన్మానం...

ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్గా నిలిచిన మల్లంపల్లి హైస్కూల్ విద్యార్థిని జనగాం కావ్యశ్రీని కలెక్టర్ ఘనంగా సన్మానించారు. పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిగమించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి, డీఈఓ రంగయ్య నాయుడు, తహసీల్దార్ సమ్మక్క ఎంపీడీవో లెక్కల అరుంధతి, సీఎంఓ డాక్టర్ కే.శ్రీనివాస్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు అజ్మీర భార్గవి, స్థానిక మల్లంపల్లి సర్పంచ్ బూర రాధిక హేమచంద్ గౌడ్ సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి తిరుమలలో సూర్యప్రభ వాహన సేవ వేడుకలు ప్రారంభం
*తిరుపతి : తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలు.*   *ఈ నెల 25న ఉదయం సూర్యప్రభ వాహనసేవతో...
By Rajini Kumari 2026-01-20 10:43:17 0 134
Andhra Pradesh
అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల...
By Pagadala Venkateswar 2026-03-12 05:36:57 0 116
Jharkhand
Crackdown on Corruption: ED Files Case in Treasury Scam
The Enforcement Directorate (ED) has officially registered a money laundering case (ECIR)...
By Dunna Jessicaruth 2026-05-15 10:02:34 0 47
Delhi - NCR
Orange Alert: Dust Storms and Haze Grip the Capital
Residents woke up to a haze-filled morning as the IMD issued an orange alert for Delhi, Noida,...
By Dunna Jessicaruth 2026-05-15 07:57:15 0 41
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
By John Baji 2026-01-02 12:57:34 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com