రాష్ట్రానికి పెట్టుబడుల వరద.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం!

0
58

నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

రూ. 2.01 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్

విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

ఈ ప్రాజెక్టుల ద్వారా 39 వేలకు పైగా ఉద్యోగాల కల్పన

ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలపై కేబినెట్ తుది నిర్ణయం

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా, భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో సుమారు రూ.2.01 లక్షల కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 39,067 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

 

ఇప్పటికే 17వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం పొందిన ఈ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. వీటిలో అత్యంత కీలకమైనదిగా విశాఖపట్నంలో రూ.1.08 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టు ఉంది. ఐటీ, డిజిటల్ మౌలిక వసతుల రంగంలో ఈ ప్రాజెక్టు విశాఖకు మరింత ప్రాధాన్యం చేకూర్చనుంది.

 

ఇవే కాకుండా, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.51,300 కోట్లతో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్, కడప జిల్లాలో రూ.12,297 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో రూ.2,508 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్, శ్రీసిటీలో రూ.6,100 కోట్లతో అపోలో టైర్స్ యూనిట్ వంటి భారీ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

 

అలానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన పొదుపు చర్యల సూచనలపైనా కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రభుత్వ వ్యయ నియంత్రణ చర్యలపై సమీక్షించి తగు సూచనలు చేయనున్నారని సమాచారం. జిల్లా పర్యటనల సమయంలో తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోగా, ఇదే నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అనుసరించే పరిస్థితి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌డెడ్.
మదనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పుంగునూరు రోడ్డులోని వలసపల్లి నవోదయ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు...
By Pagadala Venkateswar 2026-01-31 08:10:43 0 128
Andhra Pradesh
అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా...
By Mobbu Venkatramana 2026-03-10 08:56:22 0 256
Andhra Pradesh
పేదల కళ్ళలో సంక్రాంతి వెలుగులు సంక్రాంతి కానుకగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు
*పత్రికా ప్రకటన* *విజయవాడ,13.01.2026*    *పేదల కళ్ళలో సం'క్రాంతి' వెలుగులు...*...
By Rajini Kumari 2026-01-13 15:54:27 0 160
Andhra Pradesh
డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోస్టల్ ఎస్పీ.
కర్నూలు: డోన్ : కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ జనార్ధన్ రెడ్డి శనివారం రోజు డోన్ ఉప తపాలా...
By Hari Krishna 2025-12-14 04:47:03 0 244
Andhra Pradesh
సీఎం సమీక్షకు హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై...
By Pagadala Venkateswar 2026-02-17 05:25:18 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com