ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు

0
81

 కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సీడ్స్ లైసెన్స్ మంజూరు చేయడానికి మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని రంగన్న గౌడ్ నుండి ఏఈఓ నరసింహులు, మరో వ్యక్తి మోహన్ కలిసి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బుధవారం నగదు తీసుకుంటుండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజు, ప్రభాకర్ పాల్గొని కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మరి కాసేపట్లో టీవీ కే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ
*కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ*   చెన్నైలో కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్...
By Rajini Kumari 2026-05-08 13:30:56 0 74
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి బోర్డు నిర్లక్ష్యం.. ప్రజల్లో అసహనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పాత బోర్డు...
By Pagadala Venkateswar 2026-03-20 10:34:40 0 130
Telangana
నేడు ఈ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు.....!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే  తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి....
By Gujile Ramu 2026-05-17 03:40:04 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com