ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం: డ్రైవర్ నిర్లక్ష్యనికి 14నెలల పసికందు బలి

0
484

🎤కుమురంభీమ్ ఆసిఫాబాద్: భారత్ అవాజ్ న్యూస్ జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ లో నిన్న మే 13న జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ యొక్క అజాగ్రత్త నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా 14 నెలల పసికందు తరుణ్ ప్రాణాలు కోల్పోయడు.చింతలమనేపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన భీంరావు గీత దంపతుల కుమారుడు తన నాయనమ్మ మనవడు తరుణ్ ని ఎత్తుకొని కాగజ్ నగర్ బస్సు ఎక్కడానికి వచ్చింది బస్ ఎక్కుతు ఉండగా మరోబస్సు రివర్స్ తీసుకునేక్రమంలో వారిని బస్సు ఢీ కిట్టింది రెండు బస్సుల మధ్య ఇరుక్కుని బాలుడు తరుణ్ కు తీవ్ర గాయాలయ్యాయి తరుణ్ ను హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గామధ్యలోనే మృతి చెందాడు బస్సు ఢీ కొట్టడంతో తనచేతిలో ఉన్న మనవడు కింద పడి ప్రాణాలు కోల్పోయాడని మహిళా కన్నీటి పర్యంతం అయ్యింది ఈ ఘోర ప్రమాదానికి నిరసనగా బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు బంధువులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ డిపో ఎదుట బాలుడి శవంతో భారీ రాస్తారోకో నిర్వహించారు.ప్రమాదనికి కారణమైన డ్రైవర్ పై కఠినచర్యలు తీసుకోవాలని భాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేసారు.ఆందోళన తీవ్రం కావడంతో ఆర్టీసీ అధికారులు.తక్షణమే స్పందించి బాధిత కుటుంబనికి అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ.25000.తక్షణ ఆర్థిక సాయంగా అందచేశారు.ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన కారులు రాస్తారోకో విరమించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రం: కొత్తిమీర మూట జారిపడి మహిళ చెవి తెగిన వైనం.
బుధవారం రామసముద్రం మండలంలో కొత్తిమీర మూటలను లోడ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన...
By Pagadala Venkateswar 2026-05-28 06:50:11 0 77
Telangana
కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.   బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది...
By Sidhu Maroju 2025-07-21 17:07:27 0 1K
Andhra Pradesh
కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
*కేరళలో సైకిల్‌ తొక్కుతూ రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం*    లోక్‌సభలో...
By Rajini Kumari 2026-03-31 17:02:53 0 153
Andhra Pradesh
భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి
*భవాని దిక్ష మహోత్సవంలో అపచారం... అపచారం..*   *యావత్ గురుభవానీలు స్పందించాలి..*  ...
By Rajini Kumari 2025-12-14 13:42:16 0 238
Telangana
మేడ్చల్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
మెడ్చల్ ఎక్సైజ్: ₹9 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ఇద్దరి అరెస్టు ‎ ‎మెడ్చల్‌లో...
By Ponnala Srinivasrao 2026-03-17 14:43:48 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com