పేకాట పై పోలీసులు మెరుపు దాడి

0
69

- పేకాటపై పోలీస్ మెరుపు దాడి..

- నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్..

- రూ.6500 నగదు, నాలుగు సెల్ ఫోన్ లు సీజ్.

చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించిన పోలీసులు.

నమ్మదగిన సమాచారంపై సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా మెరుపు దాడి చేయడం జరిగింది. రైడ్ నిర్వహించి నలుగురు పేకాటరాయుల్లను అరెస్టు చేసి చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. మరో నలుగురు పోలీసులను చూసి పారిపోయారు. పట్టుబడి చేసిన నలుగురు వ్యక్తుల నుండి సుమారు 6,500 నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో ఉపేక్షించేది లేదని ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన...
By Ponnala Srinivasrao 2026-05-09 02:16:23 0 88
Bharat
HAPPY REPUBLIC DAY!
The strength of a nation lies in the power of its people’s voice. Today, we celebrate the...
By Bharat Aawaz 2026-01-25 18:45:19 0 690
Telangana
"పోలీస్ స్టేషన్ కాదు… పుట్టిల్లు! ఖాకీల మమకారం కన్నీళ్లు తెప్పించింది.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జీడిమెట్లలో చోటుచేసుకున్న ఒక హృదయస్పర్శి ఘటనను మీతో...
By Sidhu Maroju 2026-04-17 07:24:26 0 134
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –          ...
By Rajini Kumari 2025-12-26 10:04:50 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com